Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

చర్మ సౌందర్యం 1

చిన్నపిల్లల్లో పులిపిరుల సమస్యా?

చాలామంది పిల్లలకి పులిపిరి కాయల సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలియని పరిస్తితి ఉంటుంది. పులిపిరులు ఎందుకు వస్తాయి? వాటిని నివారించుకోవటం ఎలా అని చాలా సతమతమవుతుంటారు. ఏదిఏమైనా వాటి రాకకు మాత్రం కారణాలు ఉండవు. చర్మంపై వచ్చి కాస్త ఇబ్బందిని కలిగిస్తూ నానాటికి వ్యాప్తి చెందే పులిపిరుల గురించి అవగాహన ఎంతైనా అవసరం. అవి ఎందుకు వస్తాయో తెలుసుకుందామా..

ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం.

ఈ వ్యాధి వ్యాప్తి జరిగే తీరు :

1. చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు.

2. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే… బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.

చికిత్స విధానం :

1. ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయించుకోవచ్చు.

2. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.

3. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి.

చర్మ పరిరక్షణకు..

 

ప్రస్తుతం చిన్నవారి నుంచీ పెద్దల వరకు అందరూ డై వేసుకుంటున్నారు. అది తెల్ల జుట్టు అవుతుందని కావచ్చు. లేదా మరి వేరే స్టైల్ కోసం కావచ్చు. ఏది ఏమైనా డై వాడటం మాత్రం సహజమైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.

అందుకని…చర్మ సమస్యలు రాకుండా ఉందేదుకు కొన్ని చిట్కాలను మీకందిస్తున్నాం.

1. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.

2. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి.

3. తలంటుకునేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.

4. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.

5. జుట్టు మంచి స్మెల్ రావాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

అతి మృదువైన చర్మం ముఖం మీద ఉంటుంది. ముఖానికి ఆవిరి ఎంత సేపు పెట్టుకోవాలో తెలియాలి. ఆవిరి పెట్టడం మంచిదని చాలామంది ఎక్కువసేపు పదుతుంటారు.ఇద్ ప్రమాదమే. ఈ సమస్య నుంచీ అధిగమించటం కోసం ఆవిరి ఎంతసేపు పెట్టుకోవాలో తెలుసుకోవాలి.

1. బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.

2. ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

4. ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి.

5. ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. చర్మతత్వం తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్‌మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం చేయడం మేలు.

6. పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి.

చక్కని చర్మం పొందాలంటే

 

ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్స్ వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అందమైన చర్మం కావాలంటే కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవెంటో చూసేద్దమా..

1. మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్న వారు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ను దూరంగా ఉంచడం మంచిది.

2. జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ చర్మ రంధ్రాలలో చిక్కుకుని బ్లాక్‌హెడ్స్‌ అనంతరం మొటిమలు రావడానికి కారణమవుతుంది.

3. ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నట్టు అయితే సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించడం మంచిది.

4. పదే పదే సబ్బును ఉపయోగించి ముఖం కడగడం కన్నా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మ కణాలు పాడయ్యే అవకాశముంటుంది.

5. మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్‌ మంచిది. చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయ డం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.

6. బాగా జిడ్డు చర్మం ఉన్నవారు ఆ జిడ్డును తొలగించుకునేందుకు క్లే మాస్క్‌ ఉపయోగించడం మంచిది. పుదీనా, పిప్పర్‌మెంట్‌ లేదా చికాకు చేసే పదార్ధాలు లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.

7. నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇది బ్లాక్‌హెడ్స్‌ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.

8. ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతకడం మరువకండి.

9. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.

చర్మ రోగాలకు సహజసిద్ధమైన నివారణ

 

మన శరీరంలో అత్యంత పెద్ద అంగం చర్మం. ఏ అంగానికి వ్యాధులు ఏర్పడినా కాస్త త్వరగా తగ్గుతాయేమోగాని చర్మానికి వ్యాధులోస్తే ఆట్టే తగ్గనే తగ్గవు. అయితే చర్మ వ్యాధుల బారిన పడినప్పుడు వాటిని తగ్గించుకునే దిశగా కొన్ని సహజసిధ్ధమైన నివారణా మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా..

1. మినుములు చర్మానికి మంచి ఔషధంగా పని చేస్తాయి. మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు పోతాయి.

2. కిరోసినాయిల్ చర్మ వ్యాధులకు మచి మందు. ఎంటి కిరోసినాయిలా అనుకుంటున్నారా..అవును ఇది చర్మంపైన కిరోసినాయిల్ మాటిమాటికీ రాస్తే గజ్జి, తామర వంటి చర్మరోగాలు హరించిపోతాయి.

3. తులసి ఆకు ఒక సహజసిధ్ధమైన మంచి ఔషధం. తులశాకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరినతరువాత స్నానం చేస్తుంటే శోభి త్వరగా తగ్గుతుంది.

4. స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు, నిమ్మ పండు రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు హరించి శరీరం కాంతివంతంగా మారుతుంది.

5. తులసి, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా హరించిపోతాయి.

6. తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. అతి త్వరగా మచ్చలు పోతాయి.

7. జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెకాయలు హరించిపోతాయి.

8. తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతాయి.

9. వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలే్టట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.

10. పసుపుపొడి 3 గ్రాములు, ఉసిరిక పొడి 6 గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధి. మారేడు ఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీ్రంలో ఇరుక్కున్న ముళ్ళు, మేకులు బయటకొస్తాయి.

11. తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.

శీతాకాలంలో చర్మానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

 

శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. అంతేకాక చాలా అసహనానికి గురిచేస్తుంది. శీతాకాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదో ఒక చోట లోటు ఏర్పడటం మాత్రం సహజమే. ఈ శీతాకాలలో చర్మం పడే ఇబ్బంది నుండీ కాపాడుకునేందుకు మీ కోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవేంటో చూద్దామా..!

1. ఏదైనా బేబీ పౌడర్ లు వాడడం మంచిది . నువ్వుల నూనె చలికాలం లో చక్క గా పనిచాస్తుంది . శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో వేడి నీరు స్నానం చేస్తే చర్మం సున్నితమవుతుంది .

2. వేజలిన్ బాడీలోషన్ లేదా ఏ ఇతర బాడీ లోషన్ అయినా రాసుకొని గోరు వెచ్చని నీటి స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది.

3. స్నానము చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడినీల్లస్నానము చేయాలి .ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .

4. ఉదయం గోరువెచ్చని నీటితో స్నానము చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకొవాలి . విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది .

5. శీతాకాలము పగుళ్ళకు వేసలైన్‌ వాడాలి, లైట్ మాయిశ్చరైజర్ కి బదులు థిఖ్ క్రీమ్‌ ను ఉపయోగించాలి.

6. సాదారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడాలి.

7. రాత్రి పడుకునే ముందు చేతులకు , కాళ్ళకు వేజలైన్‌ రాసుకోవాలి.

8. వారానికు ఒకసారైన హాట్ ఆయిల్ తో మసాజ్ చే్సుకోవాలి ,పాదాలు పగల కుండా ‘సాక్స్ ‘ వేసుకుంటే మంచిది.

9. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్‌‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

మీ చర్మ సౌందార్యానికి..

 

చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి చర్మ సౌందర్యం ఇనుమడింపచేసుకునేలా ప్రయత్నిస్తాం. కానీ ఫలితాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. అయితే మన చేతిలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడే సహజసిధ్ధ క్రీములున్నాయి. వాటిని వాడితే మీ చర్మం మునుపటికంటే ఎంతో నాచురల్ గా సౌందర్యవంతంగా తయారవుతుంది. అవేంటో చూద్దామా..

1. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.

2. మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.

3. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.

4. బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన 6. చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

7. ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.

8. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.

9. గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.

10. బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.

11. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.

12. బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.

13. నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించవచ్చు.

ముడుతలు రాకుండా ఉండాలంటే?

 

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

1. గుడ్డులో చర్మం బిగించి, ముడుతలను తగ్గించే బోయోటిన్,ప్రోటీన్లు మరియు విటమిన్లు వంటివి ఉన్నాయి. పచ్చసొన యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. క్రీమ్ చర్మంను మృదువుగా మరియు ప్రకాశవంతమైన తయారుచేస్తుంది. ఈ మాస్క్ తయారుచేయటానికి ఒక గుడ్డును అర కప్పు క్రీమ్ లో కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. మాస్క్ వేసుకొని 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ క్రమంగా ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

3. రోజ్ వాటర్తో చర్మం శుబ్రం చేసుకుంటే చర్మం మీద మలినాలు మరియు ధూళి ఎక్కువగా ఉండుట వలన ముడుతలు మరియు ఫైన్ లైన్లు వస్తాయి. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మం పునరుత్పత్తి మరియు కళ్ళు కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని రోజ్ వాటర్ లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దన చేయుట వలన చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

5. పెరుగు చర్మం కణజాలాలు,కణాల రిపేరు మరియు పునర్నిర్మాణానికి అవసరమైన విటమిన్లు కలిగి ఉంటుంది. పెరుగును రోజూ తింటే చర్మం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగు మాస్క్ తయారుచేయటానికి ఒక కప్పు పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మరసం ముఖాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పెరుగు ముడుతలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు ఉంచండి. తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

అసలు ఎలర్జీ ఎలా వస్తుందంటే?

 

నాకు ఆ వంకాయ కూర వద్దు..గోంగూర తినను నాకు పడదు. అమ్మో.. దుమ్ము వాసన, సోపు వాసన పడదు తుమ్ములోస్తాయ్ అని ఇలా చాలామంది చెబుతుంటారు. సాధారణార్థంలో శరీరం ఏదైనా పదార్థాన్ని స్వీకరించలేకపోవటం, సహించలేక పోవడాన్నే ఎలర్జీగా పిలుస్తున్నారు. వైద్య పరిభాషలో కొన్ని పదార్థాల పట్ల శరీరంలోని కణాలు భిన్న రీతిలో వ్యవహరించి అవలక్షణాలను వ్యక్తపరచటాన్ని ఎలర్జీగా చెబుతున్నారు. ఎలర్గీ కారకాల గురించి తెలుసుకుందామా!

శరీర కణాలు భిన్నరీతిలో వ్యవహరించటానికి ఎలర్జిన్‌ అనే మాంసకృత్తి కారణం. ఇది నీటిలో , గాలిలో, ఆహారంలో, ఇలా ప్రతి చోటా వుంటుంది. ఈ ఎలర్జిన్‌ కలిగి వున్న పదార్థం శరీరాన్ని తాకినా, లోపలికి ప్రవేశించినా కణాలు దాన్ని సరిగా స్వీకరించవు. శరీర కణాల ఈ అసాధారణ ప్రతిస్పందననే ఎలర్జీ అంటున్నారు వైద్యులు.

ఎలర్జీ కారకాలు

చిన్న పాటి ప్రభావాలు కలిగించే రకంనుంచి మొదలుకుని తీవ్ర పరిణామాలు కలిగించే వరకు ఎలర్జీ కారకాలు వైవిధ్య పూరితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పసి పిల్లల్లోను, చిన్న పిల్లల్లోనూ ఎలర్జీ సులువుగా ప్రభావం చూపుతూ వుంటుంది.

పిల్లలకు గుడ్లు, పాలు, గోధుమ వంటి పదార్ధాలు కూడా పట్టక పోవచ్చు. ఈ సమస్య ఐదేళ్ల పిల్లల వరకే వుంటుంది. అటు తర్వాత గాలిలో వుండే పుప్పొడి, దుము్మ, ధూళి, జంతువుల రోమాలు మొదలైనవి ఎలర్జీని కల్గిస్తాయి. ఇంకా చేపలు, వివిధ రకాల మాంసం, గింజలు, టమోటాలు, నిమ్మ, నారింజ, చాక్లెట్లు వంటివి సైతం ఎలర్జీని కలిగిస్తాయి.

ముఖంపై బుడిపెలోస్తున్నాయా?

 

ముఖం పై మొటిమలొస్తేనే ఎంతో చింతించే అతివలకు ముఖం పై బుడిపెలొస్తే ఇక చెప్పేదేముంది తట్టుకోలేనత అసహనం వస్తుంది. ఎందుకంటే ముఖంలో ఉబ్బురూపంలో కనిపించే ఇవి మహిళలకు చికాకు కల్గిస్తుంటాయి. ముఖానికంతటికీ ప్యాక్ చేసుకోవడం, బొడిపెలమీద మాత్రమే అప్లయ్ చేసుకునే ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా వీటిని పొగొట్టుకోవచ్చు. అవి ఎంతో తెలుసుకుందామా..!

1. ముఖంలో బొడిపెలు ఉంటున్నట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిదపకూడదు. ముఖం కడుక్కునేటప్పుడు కూడా గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

2. తాజా నిమ్మరసంతో ముఖం కడుక్కోవాలి. లేదా రోజుకు నాలుగైదు సార్లు నిమ్మరసాన్ని బంప్ మీద రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

3. రెండు టీ స్పూన్ల తాజా తులసి రసాన్ని మరుగుతున్న నీటిలో కలిపి చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖం కడుక్కోవాలి. లేదా ఆ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు బొడిపెపై రాయాలి.

4. కోడి గుడ్డులోని తెల్ల సొనను బొడిపె మీద రాసి ఆరిన తర్వాత కడిగితే ఫలితం ఉంటుంది.

5. ఒకటిన్నర టేబుల్ స్పూన్ల తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వేస్టులా చేసుకోవాలి. దీనిని రాత్రి పూట పేస్టులా చేసుకుని పడుకోబోయే ముందుగా బొడిపెపై రాసుకుని ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

6. రాత్రి పూట నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఆపిల్ సైడర్ వెనిగర్‌ను బంప్ మీద రాయాలి.

శీతాకాలలో చర్మ సౌందర్యానికి.!

 

శీతాకాలం వచ్చేసింది. ఇక ప్రతి మగువ తమ చర్మాన్ని కాపాడుకోవటానికి ఎన్నో క్రీముల్ని అన్వేషిస్తుంది. పొడిబారి పగుళ్ళు ఏర్పడే సమస్య ప్రస్తుతం మగువలు ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యలకు మన ఇంట్లొనే చిట్కాలు దాగి వున్నాయ్. వాటిని ఉపయోగించుకుంటే సరి. అవేంటో చూద్దామా మరి!

1. పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు.. పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.

2. మృదువైన చర్మం అయితే ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో… పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మాస్క్ వేసుకునేటప్పుడు

1. పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా… అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

2. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే… చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

3.ఇక కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి. పైన చెప్పుకున్న చిన్న, చిన్న చిట్కాలను పాటించినట్లయితే… చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకున్నవారవుతారు.

‘క్యా’రెట్ ప్యాక్

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

2. అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.

3. మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.

4. కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.

5. కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.

6. టేబుల్‌స్పూన్‌ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.

మీ చర్మ సౌదర్యానికి ‘బీట్’రూట్

 

చక్కటి గులాబీ రంగులో నవనవలాడుతూ నన్ను తినండి మీ శరీరంలో రక్తమై ప్రవహిస్తా అంటూ సందేశం ఇచ్చే ఓ వక్తలా కనపడుతుంది బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని వైద్యుల నుంచీ డాక్టర్ల వరకూ అంటూ ఉండటం మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్రూట్ ను వెలివేస్తున్నారనీ చెప్పవచ్చు. అయితే బీట్రూట్ ను తినవచ్చు, జ్యూస్ గ వాడుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు. కొందరి ఇళ్ళల్లో వండటం ఇప్పటికే జరుగుతుంది. జబ్బులోస్తే పెట్టే వంటకంగా, జ్యూస్ గా దీనిని వాడుతున్నారేగాని మరొకటి కాదు. దీని ఉపయోగాలు తెలియకపోవటమే ఇందుకు కారణం. చర్మా సౌందర్యానికి కూడా ఇది పని చేస్తుంది. అందుకే మా పాఠకులకు బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలియ చేసేందుకు ఈ శీర్షికలో ఇస్తున్నాం. బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలుసుకుందామా..!

1. గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి… చర్మం కాంతులీనుతుంది.

2. బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.

3. బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.

4. బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.

5. జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

మీ ఇంట్లోనే బాడీ లోషన్స్..

 

చర్మం మృదువుగా ఉండాలని టీవీలలో కనిపించే అడ్వెర్టైస్మెంట్లు చూసి ఇష్టమొచ్చిన క్రీములను కొని రాత్రుళ్ళు రాస్తుంటారు. తీర అవి మన చర్మానికి పడక వికటిస్తే అప్పుడు చర్మ వ్యాధుల డాక్టర్ వద్దకు పరిగెడతారు. ఎందుకు? ఇవ్వనీ అవసరం లేకుండా మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో చూద్దమా..!

1. ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిస్తుంది.

2. అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టవచ్చు.

3. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్‌ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.

4. అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి

శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దానిని ఇలా తయారు చేసుకోవచ్చు.

1. మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

3. సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.

ఇక మీ బాడీ లోషన్ తయారు. ఇక ప్రతి రోజు వాడి మెరిసే చర్మాన్ని పొందండి.

సోరియాసిస్ అంటే?

కొందరికి చర్మ వ్యాధులు మానసిక బాధకు గురిచేస్తాయి. ఈ వ్యాధులు హాని చేయకపోయినా న్యూనతా భావాన్ని కలిగించి అవి ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూపులు చూసేలా చేస్తాయి. అయితే ఇవి మెల్లగా శరీరలోనికి ప్రవేశించి మెల్ల మెల్లగా వాటి ప్రభావం పెంచుకుంటూ తమ ఉనికిని పెంచుకుంటాయి. మనలో ఉన్న అశ్రధ్ధ వల్ల వాటి స్వైర విహరం పెరుగుతుంది. అందులో ఒకటి సొరియాసిస్. ఇది ఎందుకు వస్తుందో చెప్పటం కష్టం. కానీ సోరియాసిస్ రావటానికి గల కారణాలు చికిత్సా మార్గాలను మీకోసం ఇస్తున్నాం.

సోరియాసిస్ ఎలా వస్తుందంటే:

మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో ఒక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే డ్రై స్కిన్ కలిగి వుంటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే చలి కాలం, ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే.

సోరియాసిస్ కు దూరంగా ఉండాలంటే:

1. తెల్లవారి 5 గంటల సమయంలో సూర్యుడి కిరణాల్లో విటమిన్-ది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కిరణాలు తగిలినప్పుడు చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు వచే అవకాశం ఉండదు.

2. అలాగే చర్మం పొడి కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వల్ల చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. వాటిని వాడటం మంచిది.

3. మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే పసుపు కలసిన మంచి ఆయింట్మెంట్లు ఎన్నో మార్కెట్ లో లభిస్తున్నాయి. వీకో టర్మేరిక్ క్రీము ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం జరుగుతోంది. సోరియాసిస్ వున్న వారు ఈ క్రీములు వాడటం మంచిది.

4. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము, వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి కనుక చర్మం లోని రెండో పొరని కూడా అది బాధించదు అనేది గుర్థుంచుకోవాల్సిన విషయం. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

5. మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని అవి రెండూ వదిలేస్తే నిజమైన రోగం ఏమీ బాధించదు మనం గుర్తుంచుకోవాలి.

6. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

7. ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యటం శరీరానికే కాక మనసుకూ ఎంతో మంచిది. తగ్గుతుందన్న నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే కౄత నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి.

8. మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే వుంది. మనో బలం పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది.కాబట్టి చర్మ వ్యాధుల గురిచి దిగులు చెందకండి.

మీ సౌందర్యానికి..

 

ఆడవారికి అందం అన్నా, నగలన్నా ఎంతో ఇష్టం. అదీ నేటి కాలం స్త్రీలకు సౌందర్యోపాసన ఎక్కువే. అందుకే ఒకనాడులేని బ్యూటీపార్లర్లు ఈనాడు ఎక్కువైనాయి. ఎన్ని వచ్చినా అవి కూడా మొదట మనం పరిరక్షించుకునే దాన్ని బట్టి అందం నిలుస్తుందని చెబుతాయి.

కనుముక్కు తీరు బాగుండటం, మంచి రంగు, చక్కటి జుట్టు, ఎత్తుకు తగ్గ లావుతో మంచి అంగసౌష్టవం ఇలా చాలానే కారణాలు చెప్తారు. ఫీచర్స్ తో వచ్చేది సహజసిధ్ధమైన సౌందర్యం. సహజసిధ్ధమైన అందాన్ని పెంచుకునేందుకు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.అవెంటో ఇప్పుడు చూద్దామా..!

1. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.

2. మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.

3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది

4. బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

6. గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.

7. ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.

8. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.

9. బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.

10. బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.

11. నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించాలి.

12. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.

శీతాకాలంలో చర్మ పరిరక్షణకు గృహ చిట్కాలు..

 

గజగజమనిపించే చలికాలం.. అదేనండీ శీతాకాలం మన చర్మం పై దాడికి త్వరలో సిధ్ధం కానుంది. శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. ఇక మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శీతాకాలంలో చర్మం ఎదుర్కొనే ఇబ్బందులకు పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. కాబట్టి శీతా కాలంలో అతివల చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నం. అవేంటో ఒకసారి చూద్దామా..

1. పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.

2. మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి.

3. పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. ఒకవేళ మీరు మాస్క్ వేసుకుంటే పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు.

5. అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

6. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.

7. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

8. కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.

మీ చర్మం గురించి మీకు తెలుసా ?

 

మన శరీరంలో ఏ అంగనికైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ వద్దకు పరిగెడతాం. అయితే చర్మానికి సమస్య వస్తే కాసింత ఆలస్యంగా వెళతాం. ఆ సమయానికి సమస్య కాస్తా ఎక్కువైపోతుంది.ఫలితంగా ఎన్నో డబ్బులు ధారపోస్తాం. కానీ మార్పు రావటం మాట అలా ఉంచినా ఫలితం మాత్రం సూన్యం. ఎందుకంటే చర్మ సమస్య మొదలైతే అది తొందరగా తీరదు. ఈ మాట నూటికి నూరుపాళ్ళు నిజం. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుంది. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు.

ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పటం కష్టం. ప్రస్తుతం చాలా మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. చర్మంలో కూడా కొన్ని రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే చాలా మంది విఫలమవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్టపోతున్నారు. ఏ చర్మానికి ఏ క్రీములు వాడాలో తెలియక ఏదో ఒక క్రీము తీసుకుని వాడటం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు. చివరికి కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంలా తయారవుతుంది వారి పరిస్థితి. అసలు చర్మం గురించీ అది ఎందుకు ఇబ్బందికి గురి అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా మన అలవాట్లు మార్చుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.

సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలను అతినీలలోహిత (ultra violet) కిరణాలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఖహూ కిరణాలు (UVA) చర్మం వదులుగా అయ్యేలా చేస్తాయి. ఖవ్దీ కిరణాలు చర్మంలో ఉండే కణాలను కాల్చివేస్తాయి. సాధారణంగా అన్ని సన్‌లోషన్లూ ఖవ్దీ కిరణాలను మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే సన్ స్క్రీన్ లోషన్ స్థాయి ఖవ్దీ కిరణాలను(UVB) ఆపగల గరిష్టస్థాయిని మాత్రమే వివరిస్తుంది. అందువల్లనే ఎంతో మంది ఖరీదైన సన్‌లోషన్‌ వాడుతున్నప్పటికీ చర్మం వదులుగా అవుతుంది. సన్‌లోషన్‌ను వాడదలిచిన వారు ఖవ్దీ కిరణాలను మాత్రమేగాక ఖహూ కిరణాలను అడ్డుకొనగల క్రీములను ఎంచుకోవాలి. జింక్‌, అవెబెన్‌ జోన్‌ వంటి పదార్థాలు ఖహూ కిరణాలను అడ్డుకొనగలుగుతాయి. అందువలన సన్‌లోషన్లలో జింక్‌ మరియు అవెబెన్‌జోన్‌ (avobenzone) కూడా ఉండే క్రీములను ఎంచుకోవాలి.

ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.

ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాంతం బాధపడాలి అన్న మాట అవాస్తవం.

మెరిసే చర్మ సౌదర్యానికి కొన్ని పండ్లు..!

 

ఆహా.. ఏం తేజస్సు, ఏం రంగు అని మనం కొందర్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. మరి కొందరిని చూస్తే ఇందుకు భిన్నం గా ఉంటుంది. ఆలా ఉండేందుకు మనమూ ప్రయత్నిస్థాం. దాని కోసం ఏవేవో శరీరానికి రాస్తూ ఉంటాం. కారణం ఏదో తెలియక ఫేస్ ప్యాకులు, మానిక్యూర్లు చేయించుకుంటాం కాని సమస్య మనకు తెలియదు.ఫలితం మాత్రం శూన్యమే. ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఫలితం రాకపోగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవడం ఖాయం. దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. శరీరంలోనిది కూడా..! కాబట్టి పైపై రంగులు, మేకప్‌ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. మన చర్మం మెరిసేందుకు కొన్ని జ్యూసులను సేవించాలి. మనకు అందుబాటులో ఉండే పండ్లతో మన ఆరోగ్యం, అందం రెండూ ఇనుమడిస్తాయి. అవేంటో చూసేద్దామా ఒకసారి..!

జామకాయ

పండ్లలో అతి చవకగా అందరి ఇంట్లో కనపడుతూ నేను మీ ఇంట్లో ఉన్నానంటూ కనిపించేది జామకాయ. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సం తరించుకుంటుంది.

ఆపిల్‌

కోసే కత్తికి కూడా శ్రమపడకుండా అతి సుతిమెత్తగా ఉండే పండు ఆపిల్. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి. రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు.

టమాటా

ఇది రక్తా న్ని శుద్ధి చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభి స్తాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

క్యారెట్‌

క్యారెట్ను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్‌లో పోషకాలు కూడా ఎక్కువే.ఇందులో వుండే విటమిన్‌ ఏ, సిలు చ ర్మానికి తేజస్సును ఇస్తాయి. కళ్లకు కూడా ఎంతో మంచిది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

బీట్‌రూట్‌

బీట్రూట్ రసం ఎంతో మంచి విలువల్ని కలిగి ఉంటుండి. రక్తంలోని మలి నాలను తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. లివర్‌కు మంచిది. కిడ్నీ లను శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరి సేలా చేస్తుంది.

పుచ్చకాయ

దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

శీతాకాలంలో అందమైన మృదువైన, కోమలమైన చర్మం కోసం తగు జాగ్రత్తలు తీసుకుందామా

 

చల్లని చలి కాలంలో మీ అందమైన చర్మంకు ఎన్నో ఇబ్బందులు,మిగిలిన కాలాల కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది,ఎందుకంటే ఈ కాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోయి, ఒక్కో సారి పగిలిపోవడం,లేదా చిన్న చిన్న పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. కంగారుపడవలసిన అవసరం లేదు, మీరు చేయవలసిందల్లా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిబారకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి.

  • హైడ్రేషన్ మీ చర్మాన్ని ఎంతో కోమలంగా,మృదువుగా మరియూ యవ్వనంగా ఉంచుతుంది,చలికాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోతుంది,దీనిని అదిగమించడానికి,మీ శరీరంలో నీరు,మరియూ నూనె శాతాన్ని పెంచుకుని,అవి ఇచ్చే
    పదార్దాలని వాడటం మంచిది.
  • మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అనేది సహజంగా ప్రతీ కాలంలోను ఉండేదే,అయితే ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్త అవసరం ఎందుకంటే,చర్మం మిగిలిన కాలాల కన్నా ఎక్కువగా పొడిబారిపోతుంది,అందుకే మాయిశ్చరైజర్ అనేది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎంతగానో
    సహకరిస్తుంది.
  • ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది,దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి,కాళ్ళు,చేతులకు పట్టిస్తే,అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి,మంచి ప్రబావాన్ని
    చూపిస్తుంది.
  • మీ వంటి సబ్బులో క్రిమిసం హారిక లక్షణాలు ఉన్న, లేదా మీరు తీసుకునే మాయిశ్చరైజర్ లో ఆల్కహాల్ కలిగి ఉన్నా,వాటిని వాడటం మంచిది కాదు.
  • వేడి నీళ్ళతో స్నానాలు చేయరాదు,ఎందుకంటే ఈ వేడి నీటి వల్ల మీ చర్మం ఇంకా పొడిబారిపోయే ప్రమాదం ఉంది.
  • గోరు వెచ్చని నీటితో చేయడం మంచిది అంతేకాకుండా ఎక్కువసేపు స్నానం చేయడం అంత మంచిది కాదు.
ఈ చలి కాలంలో వేసుకోవాల్సిన దుస్తులు:

మీరు దరించే బట్టలలో కూడా మీ ఆరోగ్యం దాగి ఉంటుంది,అందుకే ముఖ్యంగా కాటన్ తో, ఉన్నితో తయారు చేసిన బట్టలు,మీ శరీరం అంతా వ్యాపించి మిమ్మల్ని ఈ సమస్య నుండి రక్షించేవే వేసుకోవడం మంచిది.

ఈ చలి తీవ్రతను తట్టుకోలేక చాలా మంది,వెచ్చదనం కోసం ఎండలో నిలబడతారు,దాని వల్ల చర్మం మరింత పొడి బారిపొయే ప్రమాదం ఉంది.

ఈ చలిలో తగినంతవరకూ బయటకు వెళ్ళకపోవడం ఎంతో మంచిది,ఒకవేళ వెళ్ళ వలసి వస్తే స్వెటర్ లేదా జాకెట్ ను వేసుకుని వెళ్ళడం శ్రేయస్కరం.

చలికాలంలో ఆహార నియమాలు:

మీరు వేసుకునే దుస్తులే కాదు, తీసుకునే ఆహారం కూడా మిమ్మల్ని ఈ సమస్య నుంచి కాపాడడంలో ఎంతగానో సహకరిస్తుంది, ముఖ్యంగా విటమిన్లు A, C మరియు E సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.

సెలీనియం మరియు జింక్ వంటి మినరల్స్ తీసుకుంటే మీ చర్మం యొక్క్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మీ శరీరన్ని చలి తీవ్రతనుండి,పొడి బారకుండా కాపాడడానికి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి.

అవిసె గింజలు, అక్రోట్లను, సాల్మొన్,లవంగాలు,సోయాబీన్స్,ఆకుకూరలు వంటి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

మీ చర్మ సౌందర్యం కోసం అరటి పండ్లు చెప్పే తీపి కబుర్లు(బనానా ఫేస్ ప్యాక్స్)

 

ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి పండు అంటే ఎంతో మందికి ఇష్టం, అయితే ఇదే అరటి పండు, మీ చర్మ రక్షణలో కూడా ఉపయోగపడుతుంది అంటే నమ్మగలరా, ఇంకెందుకు సందేహం, రండి ఆ ఉపయోగాలు,వాటి ప్రయోగాలు తెలుసుకుందాం:

వివిధ రకముల “బనానా ఫేస్ ప్యాక్స్”:

1. అవకాడో, బనానా ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: 1 / 2 అవెకాడో పండు గుజ్జు , 1 / 2 అరటిగుజ్జు

ఈ మిశ్రమాన్ని కలిపి, ఒక పేస్ట్ లాగా అయిన తరువాత దానిని మీ ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత మీ ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి.

2. బనానా ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: 1 / 2 అరటిగుజ్జు

మీ ముఖాన్ని శుబ్రంగా కడిగి, పొడి బట్టతో శుబ్రం చేసుకోండి,తరువాత ఈ అరటి పండు మిశ్రమాన్ని మీ ముఖం పై రాయండి,15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంచేసుకోండి.ఎలా చేస్తే మీ ముఖం అందంగా,మృదువుగా, ఎంతో కోమలంగా
మారుతుంది.

3. బనానా, తేనె ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు , 1 టేబుల్ స్పూన్ తేనె

ఈ పై మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి పట్టించి ఒక 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి,తరువాత ఒక మెత్తటి గుడ్డతో మీ ముఖాన్ని తుడుచుకుంటే మంచి కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది.

4. మోటిమలు యొక్క చికిత్సకు బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1 అరటి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మచ్చ రహితమైన, మొటిమ రహితమైన చర్మం మీ సోంతం అవుతుంది.

5. పొడి చర్మం కోసం బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు,1/2 గిన్నె ఉడికించిన ఓట్మీల్,1 స్పూన్ చక్కెర,1 గుడ్డు(గ్రుడ్డులో ఉండే పచ్చ సొన)

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

6. జిడ్డుగల చర్మం కోసం బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: గుజ్జు 1/2 అరటి, 1 స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు.

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

7. ముడతలు పడ్డ మీ చర్మాన్ని రక్షించుకునేందుకు బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 గుడ్డు( గ్రుడ్డులో ఉండే పచ్చ సొన).

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి,ఎలా వారానికి 2 రోజులు చేస్తే మంచి ప్రాభావం చూపిస్తుంది.

8. బనానా, పాలు ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు , 1 స్పూన్ తేనె, 1స్పూన్ పాలు

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

9. బనానా, ఓట్మీల్ ఫేస్ ప్యాక్:

1\2 గిన్నెలో ఓట్మీల్ , 1 స్పూన్ తేనె, 1/2 అరటి గుజ్జు, 1 గుడ్డు( గ్రుడ్డులో ఉండే పచ్చ సొన).

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

మీ చర్మ రక్షణలో “మల్లెల తైలం (Jasmine Oil)” చేసే మంత్రాన్ని చూద్దామా

 

మల్లెపువ్వు, మగువల అందాన్ని వర్ణించడానికి,ఎందరో కవులు ఉపయోగించినది,అందానికి చిరునామ “మల్లెపువ్వు”అని చెబితే అతిసయోక్తి కాదేమో. అయితే ఈ మల్లెపువ్వు తియ్యదనంతో పాటు సువాసనకు మారుపేరుగా నిలుస్తుంది. ఈ పరిమళాన్ని ఇప్పటికీ జపాన్ మరియు ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

గమ్మత్తు ఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే ఈ మల్లె రాత్రి పూట మత్రమే పూస్తుంది,అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు.అయితే దీనితో తయారు చేసిన ఆయిల్ ఎంతో సువాసనబరితమైనది, దీనిని తయారు చేయుటకు ఎన్నో మాల్లె పూల రేకులను ఉపయోగిస్తారు.ఇది చాలా అరుదుగా దోరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాంచినది.

మల్లెపువ్వు మనలోని నిస్సహాయతను దూరం చేసి, విశ్వాసాన్ని పెంచుతుంది, అంతే కాకుండా ఇది మన శరీరంపై “యాంటి డిప్రెసంట్”, “యాఫ్రొడిసియాక్”గా పనిచేసి మనలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

గాలీ, వెలుతురు, ఇలా ఏమీలేకుండా నిశబ్దం అల్లుకున్న గదులలో, తన సుగంధ పరిమళాలతో మళ్ళీ జీవాన్ని తెచ్చి సువాసన పరిమళంగా మారుస్తుంది.

ఈజిప్షియన్లు ఈ మల్లెపువ్వుని వారి “నరము వ్యాదులకు” చికిత్సగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా తలనొప్పికీ, నిద్రలేమికి కుడా ఉపయోగిస్తారు.

దీని ప్రయోజనాన్ని అనేక పద్దతులు,సంస్కృతులు, కార్యక్రమాలలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా దీని యొక్క “యాఫ్రొడిసియాక్” తత్వం మీ మానసిక స్తితిని మార్చడంలో ఎంతగానో సహాయ పడుతుంది.మీరు అధిక ఒత్తిడికి లోనైనప్పుడు, మల్లె ఆయిల్ తో మసాజు చేయించుకుంటే మీ ఒత్తిడి తగ్గి,మనసిక స్తితి మెరుగుపడుతుంది.

ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.

దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, అవి ఏమిటంటే ఇది ఒక క్రిమినాశక ఏజంట్ గా,జుట్టు ఎదుగుదలకు,దెబ్బలకు,కాలిన గాయాలకు ఒక మంచి చికిత్సగా,ఉపయోగించుకోవచ్చు.

అయితే దీనిని మూలికల మిశ్రమాలతో అంటే “రోజ్ వుడ్”,గంధము,నిమ్మతో కలిపితే శరీరం యొక్క సహజ తత్వాన్ని ప్రోత్సహించి మంచి ఫలితాన్నిస్తుంది.

ఈ ఆయిల్ ని మీ ఉదరం(పొట్ట)పై రాసుకుంటే మీ గర్భాశయ సంకోచాలలోని(Inner Parts)ఏవైన ఇబ్బంది ఉంటే దానిని తొలగించి మంచి ఉపసమనాన్ని అందిస్తుంది.

ఆరోగ్యకరమైన, ఉల్లసభరితమైన స్నానం చేయాలంటే కొంచెం 1\2గ్లాసు సోయా ఆయిల్, 5 చుక్కలు మల్లె ఆయిల్, 3 చుక్కలు జునిపెర్ ఆయిన్, తీసుకుని VitaminE ని కూడా కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

ఆరోగ్యకరమైన మసాజ్ కోసం, 8 స్పూన్లు ద్రాక్ష రసం,6 చుక్కలు మల్లె ఆయిల్,2 చుక్కలు “టీ పైన్” ఆయిల్,”నిరోలి ఆయిల్”, కలిపి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

అందమైన, కోమలమైన జుట్టు కోసం, ఈ మల్లె నూనెని 2 చుక్కలు తీసుకుని, దీనిలో 2 చుక్కలు “రొజ్ మేరి”ఆయిల్, 2 చుక్కలు”క్లారి సేజ్”,1\2ఔన్స్ బేస్ ఆయిల్ కలపి జుట్టుకి పట్టించాలి.

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

ఏడాది పొడవునా విరివిగా లభించేది బొప్పాయి. ఇందులో ఉన్న పోషకాలు మన అందరికీ ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయికి మంచి చరిత్ర ఉన్నది. అంతేకాక బొప్పాయిని మందులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బొప్పాయిని ఎన్నొ వ్యాధులకు, రోగాలకు, చర్మానికి మందుగా వాడుతున్నారు. రోజూవారి వనుల్లోనూ దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. బొప్పయిని నావికా పితామహుడైన క్రిస్టఫస్ కొలంబస్ కు ఇష్టమైన పండుని చెబుతారు. ఇది సామాన్యంగా అన్ని ఉష్ణమండల ప్రదేశాలలో పండుతుంది. క్కువ ఉష్ణోగ్రతతో పెరుగుతుంది. బొప్పాయి ఆకులు, విత్తనాలు, పాలు ప్రేగులోని పరాన్నజీవుల్ని నాశనం చేయటానికి, చాలా రకాల వ్యాధులకు మందుగా పని చేస్తుంది. అంతేకాక గర్భ నిరోధానికి, గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి రుచి, దాని విషేషతలు విస్తారమైన ఆరోగ్యానికి సోపానంగా నిలుస్తుంది.

చర్మం మరియు బొప్పాయి:

ఇది మీ చర్మాన్ని కాపాడుకోవటానికి విశిష్టమైన దివ్య ఔషధం. దీనిని ముఖానికి ఫేస్పాక్ గా వాడుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకు, చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు. చర్మంలో ఏర్పడిన మృతకణాలను, మృత చర్మన్ని పోగొడుతుంది. చర్మం మరింతగా ప్రకాశించేదుకు బొప్పాయి తోడ్పడుతుంది.

వంటిలోని కొవ్వును తీసివేయటంలో బొప్పాయి పాత్ర:

శరీరంలోని కొవ్వును తీసివేయటంలో, రక్తకణాలలోని కొవ్వును బొప్పాయి తీసివేస్తుంది. గుండె పోటు రానీయకుండా నివారిస్తుంది.

చర్మ సౌందర్యానికి బొప్పాయి: బొప్పాయి ఫేస్ మాస్క్ గా చాలా మంచిది. బొప్పాయి వయస్సును మీద పడినా వారిలో సైతం తన ప్రభావాన్ని చూపుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. వయస్సు మీరిన వారిలోనూ అందాన్ని పెంపొందించుతుంది.

శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి నివారిస్తుంది. అంతేకాక ఇది జీర్ణవ్యవస్ధపై చక్కగా పని చేస్తుంది. కాకపోతే మీరు బొప్పాయిని రోజూ వాడాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.

వ్యాధినిరోధకశక్తి మరియు బొప్పాయి: ఈ పండులో విటమిన్-ఎ, విటమిన్-సి ఉండటం వల్ల శరీర వ్యాద్థి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాక జ్వరం, జలుబు, ఫ్లూతో బాధపడే వారికి ఎంతో మంచిది. రోజూ బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా అభివృధ్ధి చెందుతుంది.

ఋతు క్రమ సమస్యలకు బొప్పాయి: ఆడవారిలో తరచూ ఉండే ఋతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు. అంతేకాక ఆడవారిలో రుతుక్రమ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని కూడా బొప్పాయి తొలగిస్తుంది.

కాలేయ కాన్సర్ కు బొప్పాయి: కాలేయ సమస్యలకు దూరంగా ఉండేట్లు బొప్పాయి చేస్తుంది. అంతేకాక కాలేయంలో ఉన్న కణాల్లో కాన్సర్ కారక క్రిములను చంపేస్తుంది.

అధిక బరువును తగ్గించటంలో బొప్పాయి: అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ వాడితే బరువు తగ్గుతారు. బొప్పాయిలో ఉన్న సహజమైన పోషకాల వల్ల తక్కువ కాలరీలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.సన్నగా తయారవాలని ఆశపడేవారికి బొప్పాయి వల్ల సన్నగా తయారయ్యే అవకాశముంది.

మలబధ్ధకానికి బొప్పాయి: మలబద్ధకానికి బొప్పాయి మంచి మందు.జీర్ణాశయంలో బొప్పాయి పని చేసి మలబద్ధకం నుంచి బయటపడేస్తుంది. మలబద్ధకం రాకుండా ఉండేందుకు బొప్పాయిని వాడితే మంచి ఫలితాలనిస్తుంది. బొప్పయిలో ఉన్న పొపైన్ ఎన్జయం జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది.

బొప్పాయి చాలా మంచి పొషక విలువలు ప్రోటీనులు కలిగిన పందు. అంతేకాక ఇది పండ్లన్నిటిలోనూ చవకగా లభించే పండు. వారానికి ఒకసారైనా దీనిని తినటం ఎంతో మంచిది. బొప్పాయిని చర్మానికి కూడా రాయటం వల్ల చర్మం మెరుస్తుంది. మనం ఎంతో ఖర్చు చేసి వాడే ఫేస్ క్రీములకన్నా బొప్పాయి ఎంతో మిన్న.

మెరిసే చర్మం కోసం నారింజ, నిమ్మ తొక్కలతో “ఫేస్ ప్యాక్”

సహజంగా మన ఏ పండ్లు తిన్నా వాటి పై తొక్కను తీసి పడేస్తాము, అయితే చాలా మందికి తెలియని, విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ పై తొక్కలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది, అది ఏమిటో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే..

ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ “ఫేస్ ప్యాక్స్”ని తయారు చేసుకోవచ్చు, అది ఎలా అంటే…ఇలా

మన మార్కెట్లో నారింజా, నిమ్మ పుష్కలంగా దొరుకుతాయి, అందులో సందేహమే లేదు, అయితే ఈ పండ్ల పై తొక్కలలోని “విటమిన్ C” మీ చర్మ సం రక్షణలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే నేరుగా ఉపయోగించడం కన్నా ఈ తొక్కలను పొడిగా చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవడం సులభము.

ఈ “ఫేస్ ప్యాక్” ని ఉపయోగించే ముందు చర్మాన్ని శుబ్రం చేసుకుంటే దానివల్ల మీ చర్మం లోని చనిపోయిన, అనవసరమైన కణాలు తొలగిపోతాయి.

ఈ నారింజ, నిమ్మ తొక్కల పొడి తయరు చేసుకోవడం ఎలా?

నారింజ, మరియు నిమ్మ తొక్కలని తీసి కొన్ని రోజులు ఎండపెట్టాలి, అవి గట్టిగా అయిన తరువాత మెత్తగా పౌడరు లాగా చేసి ఒక డబ్బాలో ఉంచాలి.అలా మీరు “ఫేస్ ప్యాక్” తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు”

ఉపయోగించుకోవడం ఎలా??

ఈ పొడిని, కొంచెం పెరుగు, నీటిలో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మీ చర్మంలోని జిడ్డు తొలగిపోయి మిల మిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

కొంచెం పెసర పిండి, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే అందమైన చర్మం కలిగి, మృదువుగా మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.

ఈ పొడిని పసుపుతో కలిపి ఉపయోగించుకుంటే మొటిమల నుంచి, నల్లని మచ్చలనుంచి, చర్మం ముడతలు పడకుండా ఎంతగానో సహాయపడుతుంది.

ఈ పొడిని ఎక్కువగా చేసుకుని ఉంచుకోవడం మంచిది, ఇది పాడైపోతుందేమో అనే భయం అవసరం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఎండిపొయిన పండ్ల తొక్కలతో తయారుచేసింది .

ఈ పై మిశ్రమం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఒక్కసారి ఉపయోగించి చూడండి,

వేసవిలో నారింజ మరియూ తేనె “ఫేస్ ప్యాక్”

1/4 కప్పు తేనె

1 1/2 టేబుల్ స్పూన్ నారింజ

ఈ పై వన్నీ కలిపి మీ ముఖానికి పట్టించి 20-30 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

కంటి పక్క చర్మం పై ముడతలా?

అందమైన చిరునవ్వంటే ఇష్టపడని వారుండరు, అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనే అందరూ కోరుకుంటారు, కాని మీ అందమైన చిరునవ్వుకు మీ కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయా, అదే ముడతలు పడ్డ చర్మంతో మిమ్మల్ని బాధిస్తున్నాయా, చింతించవలసిన అవసరం లేదు, సామాన్యంగా 40 ఏళ్ళ వయస్సులో మీ నవ్వుల చాటున ఈ ముడతలు వస్తున్నాయంటే అది మీ వయస్సు ప్రభావం వల్ల అనుకోవచ్చు, కాని ఇప్పటి కాలంలో 20 నుంచి 40 వరకూ, ఎక్కువగా 30 ఏళ్ళ వాళ్ళకు ఈ ఇబ్బంది వస్తుంది.

అసలు ఈ ఇబ్బందికి కారణాలేమిటి?పరిష్కరించడం ఎలా??

ఎదైనా సరే మితంగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి, ఎక్కువైతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మన అందమైన ముఖంలో మరింత అందమైనవి మన కళ్ళు, కాని ఈ కళ్ళ పక్క చర్మం ముడతలు పడి బాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో మనకెంతో ఇస్టమైనవే అయినప్పటికీ, ప్రమాదకరమైనవి 3, అవి ఏమిటంటే

1. ఎక్కువగా నవ్వడం

2. ఎక్కువగా ఓర కంటితో చూడడం.

3. నిదురించే పద్దతి

ఈ పై సూచించిన 3 పనులు ఎక్కువగా చేయడం వల్ల మన చర్మం సాగి, ముడతలుగా, మారుతుంది.

నవ్వడం:

ప్రతీ ఒక్కరికీ నవ్వడం అనేది ఒక గొప్ప అదృష్టం, కాని ఎవరికి వారు సొంత శైలిలో నవ్వుతూ ఉంటారు, కొందరు నవ్వెటప్పుడు వారి కంటి పక్క చర్మ కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.అయితే దీనిని గుర్తించి నవ్వేటప్పుడు ఆ కండరాలను ఉపయోగించకుండా నవ్వడం ఎంతో మంచిది.

ఓర కంటితో చూడడం:

సమాన్యంగా మనం ఓర కంటితో చుస్తూ ఉంటాం, ముఖ్యంగా ఏదైన వెలుతురు మన ముఖంపై పడినప్పుడు, సుర్యకాంతికి ఎదురుపడినప్పుడు, మనం ఇలా చేస్తూ ఉంటాం, ఇలా ఎక్కువ సార్లు చేస్తే మన చర్మం పగిలి ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.

నిదురించే పద్దతి:

మన నిదురించే పద్దతిలో కుడా ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది, అదే విదంగా, అదే పద్దతిలో ఈ సమస్యను పరిష్కరించే ప్రమాదం ఉంది.

అంటే, మనం నిదురించేఅప్పుడు కొన్ని పద్దతులు పాటిస్తే ఈ సమస్యనుంచి ఉపసమనం పొందవచ్చు. ముఖ్యంగా “యూ” ఆకారంలో ఉన్న దిండుని, లేదా పట్టు దిండుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉండవచ్చు.

ఈ సమస్యను అదిగమించడానికి చాలా మార్గాలున్నాయి అవి ఇవే:

మీకు ఈ సమస్య వస్తుందేమో అని భయపడుతున్నారా, అయితే ఈ పద్దతులు పాటిస్తే మీరు సంతోషంగా, ఏ చింతా లేకుండా ఉండవచ్చు.

ఎప్పటికప్పుడు మీ చర్మాన్ని శుబ్రం చేసుకోవడం, దుమ్ము దూళితో, మలినాలు కలిగి ఉన్న చర్మాన్ని

తీసివేసి సరికొత్త యవ్వనమైన చర్మం వచ్చేలా చేసుకోవడం అంతే కాకుండా మొటిమలు, మచ్చలు లేని చర్మం కోసం మీ చర్మాన్ని శుబ్ర పరుచుకోవడం ఇలా చేయడం వల్ల మీ చర్మం లోని చనిపొయిన రక్త కణాలను తరిమేసి, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఈ చర్మాన్ని శుబ్రం చేసుకునే పద్దతిలో “గ్లైసోలిక్ యాసిడ్(Glysolic Acid)” ను ఉపయోగిస్తే అది మీ మలినమైన చర్మాన్ని శుద్ది చేసి అందమైన, యవ్వనమైన సరికొత్త చర్మాన్ని ఇస్తుంది.

ఇలా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం వల్ల ఈ సమస్యను మీ దరి చేరకుండా కాపాడుతుంది.

మీ చర్మ సంరక్షణకు సహజమైన “బాడీ లోషన్స్”

 

ఈ బాడీ లోషన్స్ అనేవి వాడటం చాల సులభం, అదేవిధంగా తయారుచేసుకోవడం మరింత సులభం, ఒక్క 10-15 నిమిషాలు మీవి కావు అనుకుని చేసుకుంటే అందమైన మీ అందానికి కారణం అయ్యే “బాడీ లోషన్స్”ని మీరు తయారు చేసుకోవచ్చు.అదేవిధంగా వారి వారి కోరిక మేరకు మంచి సుగంధ ద్రవ్యాలు కలుపుకుంటే, మీ చర్మం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది అనడంలో సందేహం లేదు.

మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలుతో, చాల సులభంగా తయరుచేసుకోవచ్చు,ముఖ్యంగా కావాల్సినవి అల్లము, చమొమిలె పండు, కొబ్బరి,పనీరు, బాధం నూనె మొదలగునవి, సరికొత్త పరిమళాలు కావాలనుకుంటే పుదీనా , వనిల్లా , లావెండర్ రుచి వంటి సువాసనలు జోడించవచ్చు.

”బాడీ లోషన్” తయారు చేసుకునే విధానం చుసేద్దామ:

ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా,వారి శరీరానికి అనుకూలంగా ఈ “బాడీ లోషన్” తయారుచేసుకోవచ్చు, అయితే వీటి తయారీలో ముఖ్యమైనవి కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న, ని ఉపయోగిస్తే మీ పగిలిన పాదాలను, పొడి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

కావలసిన పదార్దాలు:

  • 1/2 కప్పు బాదం (లేదా) ఆలివ్ నూనె
  • 1/4 కప్పు కొబ్బరి నూనె
  • 1/4 కప్పు మైనం

కావాలంటే 1 టీ స్పూన్ విటమిన్ “E”, కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న కూడా ఉపయోగించవచ్చు.

తయారు చేసుకునే పద్దతి:

పైన సూచించిన వన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి, మరొక గిన్నెలో మీరు పోసి గోరు వెచ్చగా చేసి, అందులో ఈ మిశ్రమాన్ని కలపండి,మీ చర్మానికి పట్టించండి, మంచి ఫలితాలు లభిస్తాయి.

అందమైన చేతులు, శరీరం కోసం క్రీం:

మనకు అందుబాటులో ఉన్న వాటితో మన చేతులు, శరీరమును కాపాడుకోవడానికి మంచి క్రీం తయారు చేసుకోవచ్చు,ఇది అన్ని రకముల చర్మానికి ఉపయోగపడుతుంది .

ఈ విదంగా చేయండి:

  • 1/4 కప్పు కొబ్బరి నూనె
  • 1/8 కప్ షియా వెన్న
  • 1/8 కప్ కోకో వెన్న
  • 1 టేబుల్ స్పూన్ కలబంద రసం
  • 1 టేబుల్ స్పూన్ నూనె(బాదం, జొజోబా)
  • 5-10 చుక్కల ముఖ్యమైన నూనెలు.

తయారు చేసుకునే పద్దతి:

  • షియా వెన్న, కొబ్బరి నూనె, కోకో వెన్న తీసుకుని వేడి చేసి కరగబెట్టాలి.
  • పైన మిశ్రమాన్ని కలబంద వేరా మరియు నూనె, కావాల్సిన పదార్దములు కలిపి, ఒక కొత్త మిశ్రమంగా మార్చుకుని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి.
  • ఈ షియా వెన్న మీ కఠినమైన చేతుల్ని అందంగా, మృదువుగా, మార్చి మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.

మేక పాలు, కలబంద మిశ్రమము:

మీ పొడిబారిన, జిడ్డైన చర్మ సం రక్షణకు ఈ మిశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది, అంతే కాకుండా దీని వల్ల ఏ రకమైన దుష్ప్రభావాలు ఉండవు.

ఆధారము: తెలుగు టిప్స్.ఇన్

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free