Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

మహిళా సాధికారత 681

ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళాసాధికారతలో ప్రస్తావింపబడ్డాయి. స్వశక్తి పై విశ్వాసాన్ని ఆభివృద్ధిపరచడం కూడ సాధికారతలో కలిసి ఉంటుంది.సాధికారత దాదాపుగా కింది అంశాలతో లేదా అదే సామర్ధ్యాలతో ఉంటుంది. అవి

  • స్వయం నిర్ణయాత్మక శక్తిని కల్గి ఉండడం.
  • తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారం మరియు వనరులు అందుబాటులోకి తెచ్చుకోవడం.
  • అవును/కాదు, ఇదిగాని/ అదిగాని వంటి మాటలు గాక తమ పరిధి మేరకు ఇష్టాలను ఎంచుకోవడం.
  • సాముదాయిక నిర్ణయంలో నిస్సందేహమైన ఖచ్చితత్వాన్ని కలిగి ఉండడం.
  • మార్పుకనుగుణమైన సానుకూల దృక్పథాన్ని పొందగలగడం.
  • వ్యక్తిగతంగాను లేదా సామూహికశక్తిగాగల నైపుణ్యాల సామర్ద్యాలను మెరుగుపరచుకోవడం.
  • ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఇతరుల గ్రహణశక్తిని మార్చే సామర్ధ్యాన్ని కల్గి ఉండడం.
  • ఎదుగుదల ప్రక్రియలో, నిరంతర మార్పులకు, స్వయం ప్రేరకంగా కలిసిపోవడం.
  • అనుకూల వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం, అపవాదాల నుంచి అధిగమించడం.

భారత దేశపు మహిళల హోదా

భారతదేశపు మహిళలు ఇప్పుడు విద్య, సామజికమగా  ఆర్ధికంగా  రాజకీయం, ప్రసారమాద్యమం (మీడియా) కళా సాంస్కృతిక , సేవా విభాగాలలోను, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక విషయాలు మొదలగు వాటి కార్యకలాపాలన్నింటిలోను పాల్గొంటున్నారు.
భారతీయ మహిళలందరికిని సమానత్వం( నిబంధన14), వివక్షలేకుండుట (నిబంధన 15(1), సమానావకాశాలు కల్పించడం (నిబంధన16), సమాన పనికి సమాన వేతనం (నిబంధన 39(డి), వీటితో బాటు స్త్రీలకు పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధనలను అనుమతించడం(నిబంధన 15(3), మహిళల గౌరవానికి భంగం కల్గించే ఆచారాలను లేకుండా చేయడం(నిబంధన 51(ఎ) (ఇ), అంతేగాక మహిళలు చేసేపనులలో న్యాయపరమైన, మానవోచిత పరిస్థితులలో రక్షణ కల్పించడం, ప్రసూతి సమయంలోఉపశమనానికి (నిబంధన 42) మహిళా రిజర్వేషన్ 73వ రాజ్యంగా సవరణ ప్రకారం  సదుపాయాలను అనుమతించడం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది.
1970 వసంవత్సరం తర్వాత స్త్రీవాద ఉద్యమం శీఘ్రగతిని పుంజుకుంది. మహిళా సమూహాలన్నీ ఒక్కటిగా కలిసి మథుర లో జరిగిన అత్యాచార కేసును జాతీయస్థాయిలోనే మొట్ట మొదటి అంశంగా ముందుకు తెచ్చాయి. మథుర పోలీసు స్టేషన్‌లో జరిగిన బాలికపై అత్యాచారం చేసిన పోలీసులను నిర్దోషులుగా విడిచిపెట్టబడినవారిని ముద్దాయిలుగా నిలబెట్టడంలో విస్తృతమైన నిరసనోద్యమాలను 1979-1980 సంవత్సరాలలో చేపట్టారు. ఈ నిరసనలు జాతీయస్థాయిలో బహుళ వ్యాప్తి చెందాయి. దీనితో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగడంతో నేర విచారణ స్మృతి, భారత శిక్షా స్మృతిలోగల సాక్ష్య చట్టానికి సవరణలు చేయడం, పోలీసు అధీనంలో అత్యాచారమనేది కూడా ఒక శ్రేణిగా ప్రవేశపెట్టడం జరిగింది.
ఆడ శిశువుల హత్యలు, లింగ వివక్ష, స్త్రీ ఆరోగ్యం, మరియు మహిళా అక్షరాస్యత వంటి అంశాలలో స్త్రీవాద ఉద్యమకారులు కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారతీయ స్త్రీలపై తరచుగా జరిగే హింసాత్మక ఘటనలు మద్యపానం సేవించడం ద్వారా జరగడంతో ఆంధ్ర ప్రదేశ్‌ , హిమాచల ప్రదేశ్‌, హర్యానా, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ ఇంకను ఇతర రాష్ట్రాలలో చాలా మహిళా సమూహాలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు ఆరంభించాయి . చాలా మంది భారతీయ ముస్లిమ్‌ మహిళలు ప్రాధమిక ( మౌలిక) నాయకులను షరియత్‌ చట్టంలో గల స్త్రీల హక్కులపై వివరణకై ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా మూడు సార్లు తలాక్‌ చెప్పే విధానాన్ని విమర్శిస్తున్నారు. 1990వ సంవత్సరంలో విదేశీ సంస్థల విరాళాల నుంచి పొందిన నిధులద్వారా మహిళల దృష్ట్యా పనిచేసే నూతన స్వచ్చంద సంస్థ ఏర్పరచబడింది. స్వయం ఉపాధి మహిళా సంఘాలు(ఎస్‌ ఇ డబ్ల్యు ఎ- సేవా) వంటి స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద సేవాసంస్థలు భారత దేశపు స్త్రీల హక్కులపై ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. నర్మదా బచావో ఆందోళనలో మేధా పాట్కర్‌ లాగా స్థానిక ఉద్యమాలలో చాలా మందిమహిళా నాయకురాళ్ళు ఉద్భవించారు.

2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారతాసంవత్సరం (స్వశక్తి) గా ప్రకటించింది. స్త్రీ స్వశక్తి పై జాతీయ విధానం (పాలసీ) 2001 సంవత్సరంలో జారీ అయింది.

మహిళా సంక్షేమ పధకాలు (ఆంధ్రప్రదేశ్)

అభయహస్తం

స్వయం సహయక సంఘాల మహిళలకు వృద్దాప్యంలో ఓ ఆసరాగ అభయహస్తం పథకం ప్రారంభమైంది. అరవై సంవత్సరాలు దాటిన తర్వాత స్వయం సహయక సంఘాలకు చెందిన మహిళలకు కనీసంగ 500 రూపాయలు గరిష్ఠంగా 2200 రూపాయలు ప్రతి నెల పెన్షన్ గా అందించే కార్యాక్రమమిది. రాష్త్ర ప్రభుత్వం, భారత జీవిత భీమా సంస్థతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తొంది

అభయహస్తం స్వయం సహయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు చాలా సహయకారిగా వుంటుంది. ప్రతి సభ్యురాలు రోజుకు 1 రూపాయి చెల్లిస్తే దానికి ప్రభుత్వం మరో రూపాయి జోడిస్తుంది.

స్వయం సహయక సంఘాల మహిళలకు వృద్దాప్యంలో ఉన్నపుడు, బిడ్డల నిర్లాక్ష్యనికి గురైనపుడు వారికి ఆసరాగా అభయహస్తం పథకం ప్రారంభమైంది.

అభయహస్తం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య గారు నవంబర్ 1 2009 లో రంగారెడ్ఢి జిల్లా చేవెళ్లలో ప్రారంభించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వున్న ఇందిరా క్రాంతి పథం సభ్యులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అంతేకాదు ఈ సభ్యులంతా 2008 జూన్ 1 నాటికి కనీసం ఒక సంవత్సరమైనా మహిళా సంఘాల సభ్యులుగా వుంఢాలి వీరంతా తెల్ల రేషన్ కార్డు కలిగి వుండాలి.

60 సంవత్సరాలు దాటిన తర్వాత స్వయం సహయక సభ్యురాలికి కనీసం 500 రూపాయలు నుంచి గరిష్టంగా, పథకంలొ చేరినప్పటి వయస్సును బట్టి 2200 రూపాయలు వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది.

గృహహింస నిరోధక చట్టం 2005

కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దాని కోసం ఒక చట్టం చేయ్యాలని మహిళా సంఘాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం మొట్ట మొదటిసారి గృహహింసని నేరంగా గుర్తించి, గృహహింస నిరోదక చట్టం 2005 ను తీసుకోచ్చింది. జమ్ము కాశ్మీర్ తప్ప మిగిలిన దేశమంతా ఈ చట్టం అమలులో కొచ్చింది. గృహహింస నేదుర్కొనే స్త్రీలందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఇది ఒక సివిల్ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు ( స్త్రీలకు) ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడింది.

తన కుటుంబానికి సంబందించిన సమీప బంధువులైన మగవారుఆడవారుకూడా, అత్తా ,ఆడపడుచు, తోడికోడలు  ( భర్త/ బావ/ మరిది/ అన్నదమ్ములు/ మామ/ కొడుకు/అల్లుడు/ తండ్రి ) జరిపే ఎటువంటి గృహహింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పడింది.

ముఖ్యంగా మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిందో, ఎక్కడైతే హింసకు గురౌతుందో అక్కడే వుండి తన న్యాయపోరాటం కొనసాగించే వెసులు బాటు ఈ చట్టం ద్వారా లభించింది. మహిళలకు తాము నివసించే ఇంటిలో హక్కును మొదటి సారి ఈ చట్టం కల్పించింది. ఈ నివాస హక్కు అనేది ఈ చట్టంలో అతి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి.

ఇది సివిల్ చట్టం అయినప్పటికీ పకడ్బందీగా అమలు కోసం నేరన్యాయ వ్యవస్థకు అమలు భాద్యత పొందుపరిచారు.

వైవాహిక జీవింతంలోని సున్నితమైన భార్యభర్తల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, పోలీస్ పాత్రని పరిమితం చేస్తూ మేజిస్ట్రేట్ పాత్రని, కుటుంబపెద్దగా హింసకు పాల్పడే పురుషులకు కౌన్స్ లింగ్ సౌకర్యం కల్పిస్తూ హింసకు పాల్పడరాదనీ ఆదేశాలిస్తూ చిన్న చిన్న సమస్యలను సరిదిద్దేలా మేజిస్ట్రేట్ పాత్రని రూపొందించారు. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిన పక్షంలో ఇది క్రిమినల్ కేసవుతుంది. నిందుతులని శిక్షించే వీలు కూడా ఈ చట్టం లో పొందుపరిచారు.

కుటుంబాల్లో స్త్రీలు ఎదుర్కొనే హింసని చాలా విస్తృతంగా నిర్వచించింది ఈ చట్టం. శారీరక హింస, లైంగిక హింస, భావోద్రేక హింస, మానసిక హింస, ఆర్ధిక హింసలను వివరంగా నిర్వచిస్తూ ఇలాంటి హింసలన్ని ఈ చట్ట పరిధిలోకి తెచ్చారు.

గృహహింస నిరోధక చట్టం కింద మహిళలకు రక్షణ చేకూర్చే సంస్థలు:

రక్షణాధికారులు:

ఈ చట్టం సక్రమంగా అమలవ్వడంలో ముఖ్య పాత్ర పోషించేది రక్షణాధికారులే . భాధితురాలికి ఉచిత న్యాయ సేవలు, ఆర్ధిక సహయం, పిల్లల కస్టడి, ఆశ్రయం అందించే సంస్థల వివరాలు, వైద్య సహయం మొదలైన సమాచారాన్ని అందించడం రక్షణాధికారి ముఖ్య భాద్యత. కుటుంబ హింసకు గురైన భాధితురాలు రక్షణాధికారిని కలిసి తన ఫిర్యాదును ఇవ్వవచ్చు. ప్రతి జిల్లాలోను ఐ.సి.డి. ఎస్- పి. డి నే రక్షణాధికారిగా నియమించారు. రెవిన్యు డివిజన్లలో ఉండే ఆర్. డి. వో లు కూడా రక్షణాధికారులే.

సర్వీస్ ప్రొవైడర్లు లేదా సహాయసంస్థలు:

కుటుంబహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005 అమలులో రక్షణాధికారులకు ఎంత కీలక పాత్ర వుందో సర్వీస్ ప్రొవైడర్లకు కూడా అంతే ముఖ్య పాత్ర వుంది. ఆయా ప్రాంతాలలో పనిచేసే స్వచ్చంద సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్స్ గా ప్రభుత్వంలో రిజిస్టర్ చేయించుకోవాలి.
స్త్రీల సమస్యలపై పనిచేసే 72 స్వచ్చంధ సంస్థలను ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్ల్ గా నియమించింది.
కుటుంబ హింసకు గురైన భాదిత మహిళ కోరితే కుటుంబ హింస నివేదిక ( డి. ఐ. ఆర్) ను తయారు చేసి రక్షణాధికారికి లేదా మేజిస్ట్రేట్ కి ఇవ్వడం, వైద్య సహాయం అందించడం, షెల్టర్ హోం లో ఆశ్రయం కల్పించడం లాంటి విధాముగ  సర్వీస్ ప్రోవైడర్లు నిర్వర్తించాలి.

మేజిస్ట్రేటు బాధ్యతలు:

కుటుంబహింసకు గురైన బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చట్టం కింద బాధితురాలు ఈ క్రింది ఉపశమనాలను మేజిస్ట్రేటును కోరవచ్చు.

  1. ప్రతివాదితో కలిసివున్న ఇంటిలో నివసించే హక్కు
  2. రక్షణ ఉత్తర్వులు
  3. వేరుగా వుండేందుకు నివాసహక్కులు
  4. ఆర్ధిక ఉపశమన ఉత్తర్వులు
  5. పిల్లల ఆధీనపు ఉత్తర్వులు

భాదితురాలిని ఫొన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, ఇ మెయిల్ ద్వారా మానసిక వేదనకు గురిచేస్తే వాటిని నిలుపుదల చేస్తూ మేజిస్ట్రేటు ఉత్తర్వులివ్వవచ్చు. గృహహింసకు సంబందించిన కేసులను 60 రోజుల్లో విచారించి తీర్పు నివ్వాలి. కోర్టు ఉత్తర్వులను నిందితులు ఉల్లంఘిస్తే ఏడాది జలు శిక్ష గాని, 20,00/- జరిమానా గానీ రెండింటిని గానీ మేజిస్ట్రేటు విధించవచ్చు.

పోలీసుల పాత్ర:

ఈ చట్టం సివిల్ చట్టం కాబట్టి దీని అమలులో పోలిసుల పాత్ర నామమాత్రమే. అయితే భాదిత మహిళ కుటుంబహింసకు సంబందించిన ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే గృహహింస చట్టం గురించి, ఆ చట్టం ద్వారా లభించే ఉపశమనాల గురించి ఆమెకు వివరించి రక్షణాధికారి దగ్గరకు గానీ, సర్వీస్ ప్రోవైడర్ల దగ్గరకు గాని ఆమెను పంపించాలి. 
మేజిస్ట్రేటు జారి చేసిన వివిధ ఉత్తర్వులని ప్రతివాది ఉల్లంఘిస్తే అది నేరమౌతుంది. ఈ అంశాన్ని భాధితురాలు కోర్టు దృష్టికి గాని, పోలీసుల దృష్టికి గాని తేవాల్సి వుంటుంది. ఉత్తర్వుల అమలు చేయడంలో పోలిసులు తప్పని సరిగా రక్షణాధికారికి సహకరించాలి.

వివరాలకు సంప్రదించవలసిన అడ్రస్:

డైరెక్టర్, మహిళా శిశు అభివృధ్ధి శాఖ ఫోన్ నెంబర్
యూసుఫ్ గూడ , హైదరాబాదు 040 - 23202355, 9440814531
శ్రీకాకుళం 9440814582, 08942-221276
ఆదిలాబాద్ 9440814455, 08554-232337
ఆనంతపూర్ 9440814471, 08732-236630
చిత్తూరు 9440814486, 08572-234544
కడప 9440814489, 08562-244039
ఈస్ట్ గోదావరి 9440814682, 0884-2368442
గుంటూరు 9440814511, 0863-2234159
హైదరాబాదు 9440814531, 040-23202355
కరీంనగర్ 9440814450, 0878-2254647
ఖమ్మం 9440814441, 08742-255857
క్రిష్ణ 9440814589, 0866-2493197
కర్నూల్ 9440814461, 08518-277721
మహబూబ్ నగర్ 9440814557, 08542-272778
మెదక్ 9440814544, 08455-276460
నల్గొండ 9440814566, 08682-245983
నెల్లూరు 940814522, 0861-2329481
నిజామాబాద్ 9440814550, 08462-238109
ప్రకాశం 9440814506, 08592-235304
రంగారెడ్డి 9440814537, 040-23240023
విశాఖపట్నం 9440814575, 0891-2706156
విజయనగరం 9440814584, 08922-277985
వరంగల్ 9440814433, 0870-2550359
వెస్ట్ గోదావరి 9440814587, 08812-242621

ఉచిత న్యాయ సహాయం

న్యాయం దృష్టిలో అందరు సమానులే. న్యాయనికి గొప్ప బీద తేడా లేదు. అందరికి సమాన అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్ధిక కారణాల మూలంగా కాని మరి ఏ యితర బలహీనతల వల్ల గాని న్యాయన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద, బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులో కి తేవడం కోసం, వారికి సామాజిక ఆర్ధిక న్యాయం కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు. ఫలితంగా 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 ఎ జత చేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయన్ని అందించడం రాష్త్ర ప్రభుత్వాల భాద్యతగా నిర్దేశించారు. 
అంతే కాకుండా ఇందు కోసం ఒక చట్టాన్ని రూపొందించారు. అదే న్యాయ సేవల అధికారిక చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్త్ర ప్రభుత్వం, రాష్త్ర హైకోర్ట్ ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశికాలను రూపొందించారు.

అర్హులు:

ఈ చట్టం, దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ కనపరచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు.

  • షెడ్యూల్డ్ కులం లేక తెగ కు చెందిన వారు
  • మానవ అక్రమ రవాణ భాదితులు, యాచకులు
  • స్త్రీలు, పిల్లలు
  • మతి స్థిమితం లేని వారు, అవిటి వారు
  • సామూహిక విపత్తు, హింస కాండ, కుల వైషమ్యాలు, అతి వృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్న వారు
  • పారిశ్రామిక కార్మికులు
  • ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం 1956 లో సెక్షన్ 2(జి) లో తెలిపిన "నిర్బంధం" , సంరక్షణ నిర్బందంతో సహా లేక బాల నేరస్తుల న్యాయ చట్టం 1986 సెక్షన్ 2 (జ్) లో తెలిపిన నిబంధనలో మెంటల్ హెల్త్ చట్టం 1987 సెక్షన్ (జి) లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయంలో తెలిపిన " నిర్బంధం" ఉన్న వ్యక్తులు
  • వార్షిక ఆదాయం రూ 50,000/- కు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చు.

దరఖాస్తు చేయు పద్దతి:

న్యాయ సహాయం కోరువారు తమ కేసు యొక్క పూర్వపరాలు, కావలసిన పరిష్కారం వివరిస్తూ అఫిడవిట్ ను, సంభందిత డాక్యుమేంట్లను జత చేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దారులు పైన తెలిపిన అర్హతలలో ఏవి కలిగి ఉన్నది తెలియపరుస్తూ తగిన ఆధారాలను పంపిన యెడల తగిన చర్య తీసుకోవచ్చు.

దరఖాస్తు చేయవలసిన చిరునామా:

ఉచిత న్యాయ సహాయం కోరువారు తమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు గల జిల్లా న్యాయ అధికార సంస్థలకు గాని రాష్త్ర హైకోర్ట్ నందు గల రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థకు గాని తమ కేసుల వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చును.

  1. సెక్రటరి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా కోర్ట్ భవనాలు లేదా
  2. మెంబర్ సెక్రటరి, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, న్యాయ సేవా సదన్, సివిల్ కోర్ట్ భవనాలు, పురాన హవేలి, హైద్రాబాద్ - 500 002

న్యాయ సహాయ విధానాలు:

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహ ఇప్పించుట
  2. కేసులని పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తు దారుని తరపున న్యాయ వాదిని నియమించి ఆ యా కోర్టులలో కేసులు చేపట్టుట
  3. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు కేసుకు సంబందించిన కోర్ట్ ఖర్చులు భరించుట
  4. న్యాయ సహాయం పొందిన వారికి ఆయా జడ్జిమెంట్లు నకళ్ళు ఉచితంగా ఇచ్చుట మొదలగు సహాయాలు అందించబడతాయి

సంప్రదించవలసిన ఫోను నెంబర్లు :

శ్రీకాకుళం 944090106
ఆదిలాబాద్ 9440901043
ఆనంతపూర్ 9440901044
చిత్తూరు 9440901045
కడప 9440901046
ఈస్ట్ గోదావరి 9440901047
గుంటూరు 9440901048
హైదరాబాదు 9440901065
కరీంనగర్ 9440901049
ఖమ్మం 9440901050
క్రిష్ణ 9440901051
కర్నూల్ 9440901052
మహబూబ్ నగర్ 9440901053
మెదక్ 9440901054
నల్గొండ 9440901055
నెల్లూరు 9440901056
నిజామాబాద్ 9440901057
ప్రకాశం 9440901058
రంగారెడ్డి 9440901059
విశాఖపట్నం 9440901061
విజయనగరం 9440901050
వరంగల్ 9440901063
వెస్ట్ గోదావరి 9440901064
పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మెన్ 9440901037
కరీంనగర్ 9440901038
కడప 9440901039
గుంటూరు 9440901040
విశాఖపట్నం 9440901041
చిత్తూరు 9440901042

జన శిక్షణ సంస్థాన్

ప్రస్తుతం జన శిక్షణ సంస్థాన్ గా పిలవబడుతున్న ఈ పథకం, శ్రామిక విద్యా పీఠ్ పేరులో 1967 లో మొదలయింది.ఇది కేంద్ర ప్రభుత్వ పధకం. మొదట ముంబాయి లో ప్రారంభమయినది  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 90 కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇది వినూత్నమైన పధకంగా పిలవబడి వయోజనులకు నాన్ ఫార్మల్ విద్య మరియు శిక్షణనిస్తుంధి. దేశంలోని మారుమూల ప్రాంతాల పేదలకు ముఖ్యంగా అక్షారాస్యతలేని నిరుపేదలకు వివిధ వృత్తులలో శిక్షణ నివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ పధకం ఏటంటే:

  1. వయోజనులకు నాన్ ఫార్మల్ విద్యనందించడం
  2. సమాజంలోని బలహీనవర్గాలు - ముఖ్యంగా సామాజికంగా, ఆర్దికంగా, విద్యపరంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ పధకాన్ని అమలుచేస్తారు
  3. వెనుకబడిన వర్గాల ప్రజలకు నాన్ ఫార్మల్ విద్యనందించడమే కాక, వారికి పెన్షన్ నిచ్చి వారి జీవితాలలో మార్పు తీసుకురావడం.
  4. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీ, పురుషులకు సంఘటిత, అసంఘటిత రంగాల్లో వున్న వారికి నైపుణ్యాలను పెంచుకునేలా శిక్షణ నివ్వడం.
  5. వివిధ వృత్తి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం.

టార్గెట్ గ్రూప్

సామాజికంగా, ఆర్ధికంగా, విద్యపరంగా వెనుకబడిన పట్టణ, గ్రామీణ, స్త్రీ పురుషులందరూ ఈ పధకం కింద ఆర్హులే. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, స్వయం ఉద్యోగులు , నిరక్ష్యరాస్యులు, పనుల్లో చేరాలనుకుంటున్న వారు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం ఈ పధకం ప్రారంభమయినది. నిరక్షరాస్యులు, సగం చదువు వచ్చినవారు, షెడ్యూల్డ్ తెగలు, వర్గాలు, స్త్రీలు, బాలికలు, వలస వచ్చినవారు, మురికి వాడలలో నివశించే వారికి ఈ పధకం అత్యంత ప్రాదాన్యత నిస్తుంది.

ఈ పధకం కింద పొందే ప్రయోజనం:

  1. దీని కింద ఆర్ధిక సహకారం నేరుగా లభించే అవకాశం ఉండదు.
  2. విద్య మరియు వృత్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
  3. న్యెపుణ్యాలను పెంపొందించుకునే శిక్షణ
  4. విద్య కార్యక్రమాలు ( ఆరొగ్యం, పరిశుబ్రత), జీవితానికి అవసరమైనన వివిధ రకాల  నైపుణ్యాలు పెంపొందించడం
  5. 371 రకాలైన వృత్తి శిక్షణ కార్యక్రమాలు అమలౌతున్నాయి
  6. కొవ్వొత్తుల తయారీ నుంచి కంప్యుటర్ కోర్సుల దాక ఎన్నో వృత్తుల్లో శిక్షణ

ఈ పధకం లో ఎలా చేరాలి?

ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత జన శిక్షణా కార్యాలయాలలో ఇవ్వాలి 15- 35 సం. మద్య వయస్సు వుండే స్త్రీ పురుషులు అర్హులు. అయితే 15లోపు, 35 పైబడిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక చేయబడిన అభ్యర్దులను ఆయా విభాగాల్లో చేర్చుకుంటారు. అభ్యర్దుల ఎంపిక కేరిర్ కౌన్స్ లింగ్ ద్వారా ప్రొగ్రాం అధికారుల ద్వారా నిరంతరం జరుగుతూ వుంటారు. పటణాల్లో , గ్రామల్లో సర్వేల ద్వారా లబ్ధి దారులను గుర్తించడం జరుగుతుంధి.

ప్రత్యేకత:

ఈ పధకం కింద చేపట్టే అన్ని వృత్తి శిక్షణా కార్యక్రమాలను ఆర్ధికంగా వెనుకబడిన వారికి, యస్. సి / యస్.టి లకు ప్రత్యేక ప్రాదాన్యత నివ్వడం జరుగుతుంది. అలాగే వారు చెల్లించాల్సిన ఫీజులో కూడా రాయితీ ఇస్తారు.

సర్టిఫికెట్ల పంపిణి:

విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన అభ్యర్దులందరికీ వారు పొందిన గ్రేడ్ మార్కుల ఆదారంగా సర్టిఫికెట్లను పంపిణి చేస్తారు

శిక్షణ వల్ల ప్రయోజనాలు:

  1. ఈ శిక్షణ కోర్సుల్లో చేరిన అభ్యర్దులు తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కొత్త నైపుణ్యాలను సాదించుకోవచ్చు.
  2. ఉద్యోగ ఆధారిత శిక్షణ పొందడం వల్ల వారు వివిధ ఉద్యోగాలకు జరిగే పోటీ పరిక్షలలో పాల్గొని గెలవచ్చు. దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.
  3. స్వయం ఉపాధి పొంది, స్వంత యూనిట్లు ప్రారంభించవచ్చు
  4. వివిధ జాబ్ వర్క్ల ద్వారా తమ కుటుంబ ఆదాయమార్గాలు పెంచుకోవచ్చు.

సంప్రదించవలసిన చిరునామా:

శ్రీ. ఎ. మానయ్య, శ్రీ. ఎ. ప్రసాద్, అబిడ్స్, హైదరాబాద్, ఫొన్: 040-65526223,23311443
జనశిక్షణ సంస్థాన్, గొల్దెన్ త్రెష్ హొల్డ్, నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్

సేవాసంస్థల పాత్ర:

ఈ జన శిక్షణ సంస్థలో శిక్షణ గురించి తెలుసుకోవాలనుకున్న అభ్యర్దులను గుర్తించడంలో ఆయా ప్రాంతాలలో పనిచేస్తున్న స్వచ్చంద సంస్థల పాత్ర చాలా ముఖ్యమ్యెనది. క్షేత్ర స్థాయిలో అభ్యర్దులను గుర్తించడానికి నిర్వహించే సర్వేలో జిల్లా సాక్షరత సమితి/ స్వచ్చంధ సంస్థలు ప్రత్యేక పాత్ర వహిస్తాయి.

సబల పథకం

(రాజీవ్ గాంధీ స్కీం ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గార్ల్స్)

సబల అనేది భారత ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని డిసెంబర్ 14, 2010 లో ప్రారంభించారు . భారత దేశం మొత్తం 200 జిల్లాలలో , ఆంద్రప్రదేశ్ లో మహబూబ్ నగర్, అనంతపూర్ , విశాఖపట్నం, చిత్తూరు, పశ్చిమగో దావరి, హైదరాబాదు జిల్లాల్లో సబల పథకం అమలవుతోంది.

సబల పథకం ముఖ్య లక్ష్యాలు

  1. కౌమార దశలో వుండే బాలికల సర్వ సమృద్ధి సాధికారత
  2. వారి పోషకాహరం, ఆరోగ్యహొదాను పెంచడం
  3. బాలికలలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు పరిశుభ్రత, పొషకాహరం, పునరుత్పత్తి ఆంశాలు, లైంగిక పరమైన అనారోగ్య సమస్యలు, కుటుంబం, పెళ్లి, పిల్లలు, మొదలైన ఆంశాల పట్ల సక్రమ అవగహన కల్పించడం.
  4. ఇంటి ఆధారంగా చేసే పనుల నైపుణ్యాలను పెంపొందించడం
  5. వృత్తి పరమైన నైపుణ్యాలను పెంపొందించడం
  6. ప్రధాన స్రవంతి విద్యకు దూరమైన బాలికలకు నియత, అనియత విద్యకు దగ్గర చేయడం
  7. కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వ సేవలు అంటే ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, పిల్లల ఆరోగ్య కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, పొలీస్ స్టేషన్లు, ఈ -సేవా సెంటర్లు, జిల్లాల అధికారులు, రక్షణాధికారుల వివరాలు మొదలైన ముఖ్య అంశాల గురించి కిశోర బాలికలకు అవగాహన కల్పించడం.

లబ్దిదారులెవరు?

11 నుండి 18 సంవత్సరాల వయస్సులో వున్న ఆడపిల్లలందరూ ఈ స్కీం కింద లబ్ధిదారులే. దేశం మొత్తం మీద 200 జిల్లాలలో ఈ స్కీం లబ్దిదారులకు అందుబాటులో వుంది. పాఠశాలల వెలుపలుండే అంటే స్కూల్ డ్రాపవుట్స్ ఆడపిల్లలు, పాఠశాలకు వెళ్ళే ఆడపిల్లలు కూడ ఈ స్కీం కింద అర్హులే.

ఎవరు అమలు చేస్తారు?

మహిళా, శిశు అభివృద్ధి శాఖ వారి సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద అంగన్ వాడిలలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ సెంటర్లలో నియమిత టైం టేబుల్ ప్రకారం బాలికలు ఈ కేంద్రానికి వస్తూఉండాలి. పాఠశాలలకు వెళ్ళే ఆడపిల్లలు నెలకి కనీసం రెండు సార్లు కేంద్రానికి హాజరుకావాలి. అక్కడ వారికి అవసరమైన శిక్షణ నిస్తారు. 

ముఖ్యంగా, జీవన నైపుణ్యాలు, విద్య, పోషకాహరం, ఆరోగ్యవిద్య, సాంఘిక సమస్యల గురించి, న్యాయసంబంధ అంశాల గురించిన శిక్షణను వీరికి ఇవ్వడం జరుగుతుంది. చదువు మానేసిన పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు ఒకేసారి హాజరయ్యేలా వారి మధ్య పరస్పర చర్చలు జరిగేలాగ కూడ అంగన్వాడి కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల చదువు మానేసిన పిల్లల్ని కూడ పాఠశాల వెళ్ళేటట్టు ప్రోత్సహించడం జరుగుతుంది.

స్వాధార్, షార్ట్ స్టే వసతి గృహాలు, స్టేట్ హోం, ఉజ్వల వసతి గృహాలు

భారతీయ సమాజంలో కుటుంబానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అలాంటి కుటుంబంలోని మహిళలకు చాలా రక్షణ ఉంటుందని కుటుంబ సంబంధాలలో సురక్షితంగా ఉంటారని భావించడం జరుగుతుంది. అలాంటి కుటుంబంలో హింస చోటు చేసుకున్నప్పుడు, భర్తల వల్ల కుటుంబ హింసకు గురై వందలాది మంది స్త్రీలు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇళ్ళలోంచి గేంటి వేయబడుతున్నారు. ఉన్నపల్లంగా కట్టుబట్టలతో ఇంటినుంచి గెంటివేయబడుతున్న స్త్రీల సంక్షేమాన్ని గుర్తించి ప్రభుత్వం మహిళ శిశు అభివౄద్ధి శాఖ ద్వారా రకరకాల వసతి గ్రుహాలను ప్రారంభించింది. అందులో ముఖ్యమైనవవి ఈ క్రింద ఈవబదినవి

  1. ప్రతివాదితో కలసిఉన్న ఇంటిలో నివసిచే హక్కు
  2. తాత్కలిక వసతి గృహాలు
  3. పూర్థిస్తాయి స్వాధార గృహాలు
  4. స్టేట్ హొంస్
  5. ఉజ్వల హొంస్

తాత్కలిక వసతి గృహంలో ఇంటినుండి గెంటివేయబడిన స్త్రీకి వారం పది రోజుల పాటు వసతి కల్పించడం జరుగుతుంది. ఈ సమయంలో భాదిత స్త్రీ తన కుటుంబంతో కలిసే కౌన్స్ లింగ్ లాంటి సౌకర్యన్ని పొందగలిగి తన సమస్యను పరిష్కరించుకోగలిగి తన కుటుంబంలోకి మళ్ళి వెళ్ళాలనుకునే స్త్రీలకు ఈ తాత్కలిక వసతి గృహలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

స్వాధార్ హొంస్:

కుటుంబహింస విపరీతంగా పెరిగి భార్యభర్తల మధ్య సంబందాలు పూర్తిగా దెబ్బతిన్న సందార్భాలలో తాత్కలిక వసతి గృహాలలో ఉంటూ పది పదిహేను రోజులలో పరిష్కారం కాని తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకొసం దీర్ఘకాలిక వసతి కల్పించాల్సిన (కనీసం 3 సంవత్సరాలు) అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లతో స్వాధార్ హొంస్ ని ప్రారంభించింది. ఈ గృహాలలో కుటుంబహింస భాదిత స్త్రీలు 3 సంవత్సరాల పాటు ఉండి తమ కాళ్ళమీద తాము నిలబడేలా ఏమైన వృత్తివిద్యలలో శిక్షణ పొందుతూ తమ జీవనాన్ని తామే తీర్చిదిద్దుకునేలా ఈ స్వాదార్ హోంసు  రూపొందించారు. వీటిలో హెల్ప్ లైన్ ఏర్పాటు, మానసికపరమైన సమస్యలకు కౌన్స్ లింగ్ సదుపాయం అలాగే న్యాయస్థానాలలో తమ కేసులను పరిష్కరించు కోవటం కోసం న్యాయసహాయం అందుబాటులో ఉంటుంది.

స్టేట్ హొంస్:

ఎలాంటి ఆధారం లేని అనాధ స్త్రీలు బాలికల కోసం ప్రభుత్వం నడుపుతున్న గృహం పేరు " స్టేట్ హొం"

ఉజ్వల హొంస్:

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో బాలికల, మహిళల అక్రమరవాణా చాలా ప్రమాదకర స్థాయిలో పెరిగిపొయింది. ప్రతిరోజు ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతోమంది అమాయక స్త్రీలు పనిపేరుతో, ప్రేమ పేరుతో ఇంకా రకరకాల పేర్లతో వంచింపబడి పెద్ద పెద్ధ నగరాలైన కలకత్తా, బోంబాయి, డిల్లీ నగరాలలో వ్యభిచార గృహలకు అమ్మివేయబడుతున్నారు. స్వచ్చంధ సంస్థల సహాయంతో పోలీసులు ఆయా వ్యభిచార గృహలపై దాడిచేసినపుడు పెద్ద సంఖ్యలో ఆంద్రప్రదేశ్ కు చెందిన మహిళలు దొరుకుతున్నారు. ఇలా పట్టుబడిన మహిళలకు, బాలికలకు సరైన పునరావాసం కల్పించకపోవడం వలన తిరిగి మళ్ళి అవే వ్యభిచార గృహాలలో చిక్కుకుపోతున్నారు. ఈ సమస్యను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యభిచారగృహాలలో నుంచి రక్షించబడిన మహిళలు/ ఆడపిల్లలు రక్షణ కోసం వారికి పునరావాసం కల్పించడం కోసం ప్రారంభించిన వసతి గృహలనే ఉజ్వల హొంస్ గా పిలుస్తున్నారు.

టార్గెట్ గ్రూప్:

అక్రమ రవాణా కు గురి అయిన, గురి కాబొతున్న మహిళలు/ ఆడపిల్లలు ట్రాఫికింగ్ లో చిక్కుకుని కమర్షియల్ వ్యభిచారిణులుగా మారిన స్త్రీలు వారి పిల్లలు. ఉజ్వల వసతి గృహాలను ఈ కింది పేర్కొన్న ముఖ్య ఉదేశ్యాలతో ప్రారంభించారు.

  1. నివారణ ( ప్రివెన్షన్)
  2. రక్షించడం ( రేస్క్యు)
  3. పునరావాసం ( రిహాబిలిటేషన్)
  4. తిరిగి కుటుంబాలతో కలపడం ( రి ఇంటిగ్రేషన్)
  5. తిరిగి పంపడం ( రి పర్టేషన్)

ఈ స్కీం ప్రయోజనాలు:

అక్రమ రవాణా కు గురై రక్షించబడి ఈ ఉజ్వల గృహాలలో ఉంచిన మహిళలకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అలాగే వారికి అవసరమైన వైధ్య సహాయం, న్యాయ సహాయం, మానసిక సమస్యలు ఎదుర్కొనే వారికి కౌన్స్ లింగ్ సహాయం కూడ అందచేస్తారు .

స్వచ్చంధసంస్థ్థల పాత్ర:

ఉజ్వల గృహాలని చాలా వరకు స్వచ్చంధసంస్థలే నిర్వహిస్తాయి. కూకట్ పల్లి లో ఒక ఉజ్వల గృహం స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహిస్తున్నారు.

స్వయం సిద్ధ

స్వయం సహయక సంఘాల మహిళల్ని సాధికారపరిచే పధకం పేరే "స్వయం సిద్ధ". దీనిని ఇంతకు ముందు ఇందిరా మహిళ యోజనగా పిలిచేవారు. స్వయంసిద్ధ పధకాన్ని ప్రారంభించిన తరువాత మహిళ సమృధ్ధి యోజన పధకాన్ని కూడ ఇందులో మిలితం చేసారు. స్వయంసిద్ధ పధకాన్ని భారతప్రభుత్వం 1996 లో ఇందిర మహిళ యోజన పేరుతో ప్రారంబించింది. తొలి దశ లో చిత్తూరు, మహబూబ్ నగర్ జిల్లాలలోని 14 బ్లాక్ లలో ప్రారంభించబడింది.

రెండవ దశ లో మహిళా సాధికారత ముఖ్య లక్ష్యంగా ఇందిరా మహిళ యోజన పధకాన్ని "స్వయం సిద్ధ" అనే పేరుతొ ఫిబ్రవరి 2001 లో భారత ప్రభుత్వం ప్రారంబించింది. రెండవ దశ లో ఈ పధకాన్ని దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్త్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇందిరా మహిళ యోజన అమలులో తీసుకువచ్చింది.

ఈ పధకం మహిళా, శిశు అభివృధ్ధి శాఖ క్రింద వున్న ఐ. సీ. డి. యెస్. ద్వారా ఆమలు చేయబడుతుంది. ఈ పధకం కోసం అదనపు సిబ్బంది నియామకం కాని జీత భత్యాలు కాని మంజూరు కాలేదు. 
స్వయం సిద్ధ పధకం ఎలా అమలవుతున్నదీ పరిశీలించడానికి 2005 లో బయట సంస్థల చేత మూల్యాంఖనం చేయడం జరిగింది. ఈ పధకం అమలులో వున్న బ్లాక్ లలోని స్త్రీల సామాజిక స్థాయి బలోపేతం అయిందని సామాజిక రుగ్మతలయిన ఆల్కహాల్ (మధ్యపానం ), వరకట్నం, లింగ నిర్ధారణ పరీక్షలు జరిగి ఆడపిలల్ని హత్యలు చేయడం మొదలయిన అంశాలపట్ల స్త్రీలలో చైతన్యం పెరిగినట్లుగా ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. స్వయం సహయక సంఘాలలో చేరిన మహిళల ఆర్ధిక స్థాయి మెరుగుపడినట్లుగా కూడా ఈ ముల్యాంఖనంలో తెలిసింది. ఆంతేకాకుండా స్తీల రాజకీయ పరిజ్ఞానం పెరిగి స్థానిక సంస్థలలో పోటి చేసి గెలవడం కూడా జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ మహిళ ఆర్ధిక సహకార సంస్థ

మన సమాజంలో దాదాపు 50% జనాభా గల మహిళలు శక్తివంతులగుటకు స్వయం ఉపాధి ఏర్పరుచుకొని ఆర్ధిక స్వాతంత్ర్యం కొరకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేటట్లు చేయుటకు మరియు వారిని ప్రభుత్వాభివృద్ధి కార్యక్రమాలలో బాగస్వాములను చేసి సమాజ రాష్త్ర మరియు దేశాభివృద్ధికి తోడ్పడేటట్లు చేయుటకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1975 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృహత్తర లక్ష్యాన్ని నెరవేర్చుటకు 1987 వ సంవత్సరము నుండి మన రాష్ట్రంలో ని అన్ని జిల్లాల్లో మహిళ ప్రాంగణాలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు అమలు జరుపుతూ వస్తుంది. 

కాబట్టి మన రాష్ట్రంలో గల వివిధ జిల్లాల్లోని ఆసక్తి గల 15-30 సంవత్సరాల వయస్సు గల బీద కిషొర బాలికలు మరియు మహిళలు కనీసం 10 వ తరగతి వరకు చదువుకున్న వారు ఆ యా జిల్లాల లోని మహిళ ప్రాంగణాలలో తమ పేరు నమోదు చేసుకొనగలరు. అంగన్వాడి టీచర్లు, స్వచ్చంద్ధ సంస్థలు, డ్వాక్రా గ్రూపులు, స్వయం సహయక సంఘాలు మొదలగువారు గూడా అర్హులైనటువంటి కిషోర బాలికలను మహిళలను ప్రొత్సాహించి మహిళ ప్రాంగణం కార్యక్రామాలలో పాల్గోనేటట్లు చేసి వారి అభివృధ్ధికి తోడ్పడగలరు.

ఈ పథకం ఎందుకు స్థాపించబడినది?

స్త్రీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, వారికి కావలిసిన ఆర్ధిక సహకరణ అందిస్తూ కొత్త కొత్త పరిష్కారాలను సూచిస్తూ ఇబ్బందులు ఎదురైనపుడు సరైన సలహాలిస్తూ వారిని సాధికరపరచడం సహకారసంస్థ ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి.
ఈ పథకం ఎవరి కోసం
ఈ పథకం ముఖ్యంగా

  1. మహిళ వికాస కేంద్రాల ద్వారా గ్రామీణ మహిళల శక్థి సామర్ద్యాలను పెంపొందించే శిక్షణ నివ్వటం
  2. ఉద్యొగినుల కోసం హాస్టళ్ళ నిర్మాణం మరియు నిర్వహణ
  3. స్వచ్చంద సంస్థల కార్యక్రమాల పర్యవేక్షణ
  4. సూక్ష్మ ఆర్ధిక రుణాలు

ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాలలోని గ్రామీణ మహిళల కోసం ముఖ్యంగా ఈ సంస్థ స్థాపించబడినది. 18 - 35 ఏళ్ళలోపు స్త్రీలు మరియు 17 ఏళ్ళ లోపు బాలికలు ఈ పథకం కింద అర్హులు.

ఈ పథకం కోసం ఎవరిని సంప్రదించాలి?

ఈ సంస్థ యొక్క హెల్ప్ లైన్ నెంబర్: 040 - 23732597 www.apwcfc.org
(ఆంధ్ర ప్రదేశ్ మహిళ ఆర్ధిక సహకార సంస్థ అడ్రస్ యాడ్ చేయాలి)
అన్ని జిల్లాలల్లోని పనిచేస్తున్న దుర్గభాయి మహిళ శిశు వికాశ కేంద్రాలలో సంప్రదించవచ్చు.

పనిచేసే చోట లైంగిక వేధింపులు

లైంగిక వేధింపుల గురించి సుప్రింకోర్ట్ 1997 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ తీర్పులో ప్రాథమిక హక్కుల పరిధిని సుప్రీంకోర్ట్ మరోక్కసారి విస్తృతం చేసింది. ఉద్యోగినులు జీవించే హక్కులో లైంగిక వేదింపులు ఎలా ఉంటాయో, ఈ పరిస్థితిని ఎలా మార్చవచ్చో సుప్రీంకోర్ట్ వివరించింది. ఈ వేధింపులకి గురి చేస్తున్న వ్యక్తులపైన కఠిన చర్యలు ఎలా తీసుకోవాలో కూడా విశాఖ కేసులో ( ఏ. ఐ. ఆర్. 1997 సుప్రీంకోర్టు 3011) సుప్రీంకోర్టు వివరించింది.

మార్గదర్శక సూత్రాలు:

కనీస మానవ హక్కులైన లింగ సమానత్వం అమలు గురించి లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా పనిచేసే చోట ఉద్యొగినుల పట్ల ఉండే లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా ఎలాంటి చట్టాన్ని పార్లమెంటు చేయనందున సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలని జారీ చేయల్సిన అవసరం ఏర్పడింది.
ఈ మార్గదర్శక సూత్రాలని పనిచేసే అన్ని ప్రదేశాల్లో అన్ని సంస్థల్లో శాసనం తయారు చేసే వరకు పాటించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సూత్రాలని కోర్టు తయారు చేసిన శాసనంగా అందరూ పాటించి అమలు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం వీటిని శాసనంగా అందరూ భావించాల్సి ఉంటుంది.

1. పనిచేసే ప్రదేశం, సంస్థల యజమాని లేక భాద్యతాయుతమైన వ్యక్తి విధి:

పనిచేసే ప్రదేశం యజమానిగానీ, బాధ్యతాయుతమైన వ్యక్తిగానీ లైంగిక వేధింపులను హింసను నిరోధించడనికి, అరికట్టడానికి అవసరమైన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అవసరమైన తీర్మానాలని, ఒప్పందానికి లేక ప్రాసిక్యూషన్ ని చేపట్టాల్సి ఉంటుంది. లైంగిక వేధింపులని, హింసని నిరోధించడానికి ఆ పనిచేసే ప్రదేశం యజమాని గానీ భాద్యాతయుతమైన ఉద్యోగి గానీ ఈ ప్రయత్నాలను అవలంభించాల్సి ఉంటుంధి.

2) ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం లైంగిక వేధింపులంటే....?

ఈ మార్గదర్శక సూత్రాలలో నిర్వచించిన ప్రకారం లైంగిక వేదింపులంటే అప్రియమైన లైంగిక ప్రవర్తన కూడా లైంగిక వేధింపులలో భాగమే. అది ప్రత్యక్షంగా వుండవచ్చు, పరోక్షంగా వుండవచ్చు.
శారీరకంగా తాకడం, ఇంకా ముందుకు వెళ్ళడం, లైంగిక అనుగ్రహం గురించి డిమాండ్ లేక కోరిక, లైంగిక పరమైన మాటలు, అశ్లీల సాహిత్యాన్ని చూపించడం, ఏదైనా అప్రియమైన శారీరక, మౌఖిక లైంగిక నడవడిక.

ఈ లైంగిక వేధింపులు ఏ మహిళలకు వర్తిస్తాయి?

ఈ లైంగిక వేధింపుల నిర్వచనం ఉద్యోగినులందరికీ వర్తిస్తుంది. వాళ్ళు జీతం తీసుకుని పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు లేక స్వచ్చందంగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు.

లైంగిక వేధింపులు ద్వారా నేరం జరిగిందని ఎప్పుడు అనుకుంటారు:

ఈ లైంగిక వేధింపులు జరిగినప్పుడు భాధితురాలైన మహిళ ఆ వేధింపుల వల్ల అక్కడ పనిచేయడం అవమానకరంగా వుండి, ఆరోగ్య, రక్షణ సమస్యలు వున్నట్టు సహేతుకమైన భయం వున్నప్పుడు అది లైంగిక వేధింపు నేరం అవుతుంది.

లైంగిక వేదింపులని నిరోధించడానికి పనిచేసే చోట యజమాని గానీ, భాద్యతాయుతమైన వ్యక్తిగానీ తీసుకోవాల్సిన చర్యలు

  • సుప్రీంకోర్టు నిర్వచించిన ప్రకారం లైంగిక వేధింపులు అంటే ఏమిటో? వాటి నిషేధం గురించి అందరికీ తెలిసేటట్టుగా ఆ విషయాన్ని ఆ పనిచేసే స్థలాల్లో ప్రకటించాలి. లైంగిక వేధింపులు అంటే ఏమిటో అందరికీ తేలిసేటట్టుగా అవసరమైన రీతుల్లో వాటిని పంపిణీ చేయాలి.
  • సుప్రీంకోర్టు నిర్వచించిన ప్రకారం లైంగిక వేధింపులు నిషేదిస్తూ చెడు ప్రవర్తనగా గుర్తించి తమ క్రమశిక్షణకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్ ని సవరించాల్సి ఉంటుంది. ఈ క్రమశిక్షణని ఉల్లంఘించిన ఉద్యోగుల పట్ల చర్యలు తీసుకునేట్టుగా నిబంధనలని సవరించాలి.
  • ప్రైవేటు సంస్థలు కూడా ఈ లైంగిక వేధింపుల నిషేధాన్ని తమ స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం,1946 లో పొందుపరుస్తూ సవరణలు తేవాలి. ఈ క్రమ శిక్షణ ఉల్లంఘించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.
  • ఉద్యోగినులు ప్రశాంతంగా పనిచేయడానికి అవసరమైన వాతావరణాన్ని యజమానులు కల్పించాలి. పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిశుభ్రతల గురించి యజమానులు పట్టించుకోవాలి. అంతేకాదు ఉద్యోగినులు పనిచేయడానికి ప్రతికూల వాతావరణం ఉండకుండా చూడాలి. అనుకూల వాతవరణంలో ఉన్నానని ఉద్యోగిని భావించేట్టు వాతావరణం ఉండేట్లు చూడాలి.

క్రిమినల్ చర్యలు:

ఉద్యోగుల ప్రవర్తన వల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు యజమాని తీసుకోవాల్సిన చర్యలేమిటి? 
ఈ లైంగిక వేధింపులకి గురి చేసిన వ్యక్తుల నడవడిక, చర్యలు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం గానీ ఏదైన చట్ట ప్రకారం గాని నేరమైనప్పుడు ఆ పనిచేసే స్థలం యజమాని చట్ట ప్రకరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

ఫిర్యాదుల విభాగం

భాధితురాలికి ఊరట కలిగిస్తూ అవసరమైన ఫిర్యాదు విభాగాన్ని ఆ పనిచేసే స్థల యజమాని సృష్టించాల్సి ఉంటుంది. ఎవరి నడవడిక గురించైనా భాధితులు ఫిర్యాదు చేసినప్పుడు, ఆ నడవడిక ఏదైనా చట్ట ప్రకారం నేరమైన, కాకపోయిన, సర్వీస్ ఉల్లంఘన అయినా కాక పోయిన ఆ ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. ఆ ఫిర్యాదులని నిర్ణీత సమయంలో పరిష్కరించేటట్టుగా కూడ నిబంధనల్ని సవరించాలి.

ఫిర్యాదుల కమిటీ, సభ్యులు. వీరు ఏమి చేయాలి?

లైంగిక వేధింపుల ఫిర్యాద్లు స్వీకరించడానికి ఓ ఫిర్యాద్ల కమిటి ఉండాలి. ఈ కమిటీ కి మహిళలే నేతృత్వం వహించాలి. కమిటీల్లోని సభ్యుల్లో సగం మంది మహిళలే ఉండాలి. ఈ కమిటీకి సహకరించడానికి అవసరమైన సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయాలి. భాదితులకు సలహాలు, మార్గ దర్శకత్వం వహించడానికి ప్రత్యేకమైన సలహదారు కూడా ఉండాలి.

పనిచేసే స్థల యజమానుల బాధ్యత:

పనిచేసే స్థల యజమానులు , బాధ్యతాయుతమైన వ్యక్తులు మార్గ దర్శక సూత్రాల అమలు గురించిన నివేధికను, ఫిర్యాదుల కమిటీ నివేధికలను సంబంధిత ప్రభుత్వ డిపార్టుమెంటులకి తెలియచేయాలి.

మూడో వ్యక్తి వేధింపులు వుంటే ఏం చేయాలి?

మూడో వ్యక్తి వల్ల గానీ, ఇతరులవల్ల గానీ లైంగిక వేధింపులు ఉద్యోగినులకి కలిగినప్పుడు ఆ పనిచేసే స్థల యజమాని గాని భాద్యతాయుత వ్యక్తి గాని సహయానికి అవసరమైన అన్ని యత్నాలు చేయాలి.

ప్రైవేటు రంగంలో ఈ మార్గదర్శక సూత్రాల అమలుకు కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు:

ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఈ మార్గదర్శక సూత్రాలను పాటించడానికి అవసరమైన చర్యల్ని కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆయా ప్రభుత్వాలని కోరింది. అంతేకాదు అందుకు అవసరమైన చట్టాన్ని కూడా చేయాలని సుప్రీంకోర్టు కోరింది.

సుప్రీం కోర్ట్ తుది ఆదేశాలు:

ఈ తీర్పులో సుప్రీం కోర్టు ఈ విధంగా తుది ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగినులు లింగ సమానత్వం పాటించడానికి, అమలు పరచడానికి, రక్షించడానికి ఈ మార్గదర్శక సూత్రాలను, నియమాలను పనిచేసే అన్ని ప్రదేశాలలో తప్పక పాటించాలి. 
వీటి స్థానంలో సరైన శాసనం తయారు చేసేంత వరకు వీటిని అమలు చేయాలి.

స్వశక్తి

జెండర్ శిక్షణా దీపిక

జెండర్ శిక్షణా దీపిక 1

జెండర్ శిక్షణా దీపిక 2

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free